విజయవాడ
రోడ్డు ప్రమాదంలో ఎంబిఎ విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 September 2016
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 24: రోడ్డు ప్రమాదంలో యాష్ లారీ ఢీకొని ఎంబిఎ విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం నిమ్రా కాలేజీ ఎదురుగా జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబిఎ రెండవ సంవత్సరం చదువుతున్న భూభత్తుల రమేష్ (23) చాట్రాయి మండలం చీపురగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి కాలేజీ నుంచి ఇబ్రహీంపట్నం వస్తుండగా నిమ్రా ఇంజనీరింగ్ గేటు ఎదుట బూడిద చెరువు నుండి బూడిద ఎగుమతి చేసుకుని వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని శవపరీక్షకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.