విజయవాడ

లాడ్జి వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 17: లాడ్జి వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. బీసెంటురోడ్డుని శ్రీలక్ష్మీ మడత మంచాల లాడ్జి సమీపంలో మంజు (35) అనే వ్యక్తి మంగళవారం అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు గవర్నర్‌పేట పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.