పశ్చిమగోదావరి

పట్టిసం నుండి కృష్ణా జిల్లాకు నీటి తరలింపు పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, సెప్టెంబర్ 1: పట్టిసం ఎత్తిపోతల పథకంలో ఆరు మోటార్లను గురువారం తిరిగి ఆన్‌చేసి గోదావరి నీటిని కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో భారీ వర్షాల కారణంగా బుధవారం మొత్తం మోటార్లను నిలిపివేశారు. తిరిగి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరు మోటార్లు ఆన్‌చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో 17 మోటార్లు ఆన్‌చేసి 6వేలకు పైగా క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు తరలించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 12 మోటార్లకు తగ్గించారు. అయితే అధిక వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా నీరు చేరడంతో కృష్ణా డెల్టాకు తరలించే గోదావరి నీటిని నిలిపివేశారు. ఒక రోజు (బుధవారం) అనంతరం తిరిగి 16 మోటార్లు ఆన్‌చేసి 2,124 క్యూసెక్కుల నీటిని కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు.