పశ్చిమగోదావరి

వేగేశ్వరపురం ఎత్తిపోతల అభివృద్ధికి రూ. 8.32 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, అక్టోబర్ 25: మండలంలోని వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం అభివృద్ధికి 8.32 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని సంఘం అధ్యక్షులు కైగాల రాంబాబు తెలిపారు. కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ సహకారంతో నిధులు మంజూరయ్యాయన్నారు. 1998లో ఆరువేల ఎకరాలు సాగుచేసేలా నాలుగు మోటార్లతో ఎత్తిపోతల పథకం రూపొందించారని, దీనికి 25 కిమీ పొడవునా గ్రావిటీ కాలువలున్నాయన్నారు. మోటార్లు శిథిలావస్థకు చేరుకోవడంతో నిధుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంజూరైన నిధులతో నాలుగు కొత్త మోటార్లు, విద్యుత్ ఆధునికీకరణ పనులు, నాలుగు కిమీ పొడవునా కాలువ కాంక్రీట్ పనులు చేపడతామని ఆయన చెప్పారు.