పశ్చిమగోదావరి

నవమి వేడుకల్లో ఇంటిలిజెన్స్ అడిషినల్ డిజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, ఏప్రిల్ 15: శ్రీ రామనవమి సందర్భంగా శుక్రవారం వీరవాసరం మండలంలో నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వీరవాసరం శ్రీ సీతారామస్వామి ఆలయంలో రాష్ట్ర ఇంటిలిజెన్స్ అడిషనల్ డిజిపి రావాడ ఆజాద్ చంద్రశేఖర్ దంపతులు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. గత పదేళ్లుగా వీరి కుటుంబ సభ్యులే కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వీరవాసరం దక్షిణవీధిలోని చిలకమర్తి నరసింహం పంతులు వంశీకుల ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయం వద్ద వైసిపి పట్టణ అధ్యక్షుడు నూకల కనకారావు దంపతులు కల్యాణం నిర్వహించారు. నౌడూరు, కొణితివాడ, రాయకుదురు, పేర్కిపాలెం గ్రామాల్లోని రామాలయాల వద్ద నవమి వేడుకల్లో భాగంగా స్వామివారి కల్యాణాలు వైభవంగా జరిగాయి. ఎక్కడ చూసినా శ్రీరామనామ స్మరణతో మార్మోగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు.