పశ్చిమగోదావరి

అన్ని స్థానాల్లో విజయం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 14 : జరిగే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో కూడా వైసిపి నాయకులు విజయం సాధించేలా ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా పనిచేసి ప్రణాళిక రూపొందించుకోవాలని వైసిపి అధినేత వై ఎస్ జగన్ హితవు పలికారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, దెందులూరు నియోజకవర్గం కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరిలు ఆయనతోపాటు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయంపై విశే్లషణ జరిపారు. జగన్ మాట్లాడుతూ పార్టీ రూపొందించిన పధకాలను ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను ప్రతీ ఓటరుకు అర్ధమయ్యేలా వివరించాలని చెప్పారు. వై ఎస్ ఆర్ ప్రభుత్వం వస్తే తమకు ప్రయోజనం జరుగుతుందని ఇప్పటికే ప్రజల్లో ఆమోదం లభించిందని, అయితే దాన్ని మరింత విశదీకరించాల్సిన బాద్యత నాయకత్వంపై వుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నో జిమ్మిక్కులుచేస్తారని, వాటిని అధిరోహించి పయనించాలని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబానికి కూడా నవరత్నాలు ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ఇచ్చిన ప్రతీ హామీ కూడా స్పష్టంగా అమలుచేస్తామని, చంద్రబాబు వలే కాదని ఓటర్లకు వివరించాలని పేర్కొన్నారు. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనే ధ్యేయంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని జగన్ పేర్కొన్నారు.