పశ్చిమగోదావరి

కొవ్వూరు చేరిన మంత్రి జవహర్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, నవంబర్ 14: చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ తాళ్లపూడి మండలం అన్నదేవరపేట నుండి ద్వారకాతిరుమల వరకు చేపట్టిన పాదయాత్ర కొవ్వూరు మండలం కాపవరం, దొమ్మేరు గ్రామాల మీదుగా బుధవారం సాయంత్రం కొవ్వూరు చేరింది. ఈ పాదయాత్రకు గామన్ ఇండియా వంతెన వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని దుష్టశక్తులు ఆవహించకుండా ఉండాలని ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నానని, అందుకే ఈ పాదయాత్ర చేపడుతున్నామన్నారు. అనంతరం పాదయాత్ర నందమూరు మీదుగా పశివేదల చేరుకుంది. పశివేదలలో రాత్రి బస అనంతరం గురువారం ఉదయం పాదయాత్ర చాగల్లు మండలానికి చేరుకుంటుంది. ఈ పాదయాత్ర 102 కిమీ సాగి 16వ తేదీకి ద్వారకాతిరుమల చేరుకుంటుంది. ఈ పాదయాత్రలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి, ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, టీడీపీ నాయకులు జెవిఎస్ చౌదరి, పి శ్రీనివాసరావు, బివి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.