పశ్చిమగోదావరి

గోవుల అక్రమ రవాణా అడ్డగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, జూన్ 17: గోవులను వధించేందుకు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం నుండి తమిళనాడు పుల్లాసి పట్టణానికి లారీలో అక్రమంగా తరలిస్తున్న గోవులను శుక్రవారం స్థానిక గోసంరక్షణ సమితి సభ్యులు పట్టుకున్నారు. ఈమేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గోసంరక్షణ సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండ్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయులు పవిత్రంగా భావించే గోవులను వధించి, మాంసం వ్యాపారం చేయడం అన్యాయమన్నారు. దీనిపై చట్టం ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యంతో యథావిధిగా వధ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తేతలి సర్పంచ్ కోట నాగేశ్వరరావు, గోసంరక్షణ సమితి సభ్యులు సిహెచ్ వెంకటేశ్వర శర్మ, కె గిరీశ్వరరావు, చవ్వా శ్రీనివాసరాజా పాల్గొన్నారు.