పశ్చిమగోదావరి

గోదావరిలో స్నానానికి దిగి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 3: గోదావరి నదిలో స్నానానికి దిగిన బాలుడు ప్రమాదవశాత్తు మునిగి మరణించిన సంఘటన ఆదివారం సాయంత్రం పోలవరం పంచాయతీ పరిధిలో జరిగింది. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన కేతా మహేష్ (15) కొంతమంది యువకులతో ఇంజన్ పడవపై తూర్పుగోదావరి జిల్లాలోని పూడిపల్లి గ్రామ సమీపంలో ఉన్న గండి పోశమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మహానందీశ్వర స్వామివారి ఆలయం వద్ద ఆగి దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం గోదావరి నది వడ్డుకు చేరుకున్న వారు సహచరులు ఎంత వారించినా వినకుండా నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు గోతిలో పడి మృతిచెందాడు. మృతిచెందిన మహేష్‌ను సహచరులే వెలికితీసి, పోలీసులకు సమాచారం అందజేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు పోలవరం ఎస్సై కె శ్రీహరిరావు తెలిపారు.