పశ్చిమగోదావరి

బిజెపి నేతలను అవమానిస్తే చూస్తూ ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 3: కృష్ణా పుష్కరాల నేపధ్యంలో సిఎం చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన పురాతన దేవాలయాలను పరిశీలించేందుకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరులు దాడి చెయ్యడం చాలా దారుణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ మండిపడ్డారు. ఈ విధంగా దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఆదివారం నాడు భీమవరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వర్మ తెలుగుదేశం పార్టీ నేతలపై మాటలను తూటాలుగా పేల్చారు. పరుష పదజాలంతో విమర్శలు చేశారు. హిందూ సమాజం, ధార్మిక సంస్థలపై చేసిన విమర్శలకు ఎంపి నాని, ఎమ్మెల్సీలు భేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బెజవాడలో తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయన్నారు. ఎంపి నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. బిజెపి నాయకులపై దాడి దురదృష్టకరమన్నారు. దీనికి సిఎం చంద్రబాబుదే బాధ్యతని, కాల్‌మనీ కేసులో కీలకమైన వెంకన్నను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డిలపై టిడిపి నేతలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దుర్గమ్మ వారధిని కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని, ఇటువంటి విషయాలు కూడా తెలియని నాని రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. విలేఖర్ల సమావేశంలో పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర, యువమోర్చ నాయకులు సోము వీర వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.