S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/31/2018 - 02:22

వత్సవాయి, మార్చి 30: మండలంలోని మక్కపేట గ్రామంలో వివాహిత హత్య సంచలనం కల్గించింది. మక్కపేట - గోపినేనిపాలెం రహదారిలో జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పచ్చం నాగమణి (30) వారి ఇళ్లకు సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల వద్ద సిమెంట్ ఇటుకల మధ్యలో మృతి చెంది ఉండటాన్ని శుక్రవారం కూలీలు గుర్తించారు. మృతదేహంపై పలు చోట్ల గాయాలు, వివస్తగ్రా ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.

03/30/2018 - 23:52

ఖమ్మం రూరల్, మార్చి 30: లారీ ఢీకొని తీవ్ర గాయాలైన ఓ ఎఎస్‌ఐ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మండలంలోని ఆరెకోడు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తయిన సందర్భంగా అధికారులు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేపట్టారు.

03/30/2018 - 23:41

మదనపల్లి, మార్చి 29: కురబలకోట మండలం అంగళ్లులో గత 6 నెలల క్రితం హత్యకు గురైన సీతారామిరెడ్డి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తహశీల్దార్ మంజుల ఆధ్వర్యంలో గురువారం వెలికి తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి శరీర భాగాలను ల్యాబ్‌కు తరలించారు.

03/30/2018 - 23:32

రామన్నపేట, మార్చి 30: పాతకక్షల నేపథ్యంలో వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన రామన్నపేట మండలంలోని సూరారం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్థులు, మృతుని కుటుంబ సభ్యుల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాల ప్రకారం సూరారం గ్రామానికి చెందిన తోటకూరి లింగయ్య, (55) భార్య యశోద, ముగ్గురు కుమారులు ఉన్నారు. కొడుకులు వివాహాలు కావడంతో తమ భార్య పిల్లలతో వేరువేరు ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు.

03/30/2018 - 22:36

గుడిబండ, మార్చి 30 : మండల పరిధిలోని కేకే పాళ్యం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేకే పాళ్యం మలుపు వద్ద రైతు చిక్కన్న వ్యవసాయ భూమిలోని కానుగ చెట్టుకు 40 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి ఐదు రోజుల క్రితమే ప్యాంటుతో ఉసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

03/30/2018 - 22:27

మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 30: రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని మోతినగర్ రైల్వేట్రాక్‌పై వడ్డె సాయికుమార్(19), బోయ పద్మమ్మ(23)లు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు.

03/30/2018 - 22:25

కాకినాడ సిటీ, మార్చి 30: విధి నిర్వాహణలో ఉన్న పోలీస్ సిబ్బందిపై కారుతో ఢీకొనడానికి కారణమైన విద్యార్థిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కాకినాడ డిఎస్పీ రవివర్మ ప్రకటించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 25న ఎస్పీ కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిని కారుతో ఢీకొన్న విద్యార్థి వివరాలు తెలియచేశారు.

03/30/2018 - 22:23

కడియం, మార్చి 30: వేమగిరి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయాలపాలయ్యారు. కడియం పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న షిఫ్ట్ కారు వేమగిరి జంక్షన్‌లో ధవళేశ్వరం నుంచి కడియం వైపు వైపు వెళుతున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

03/30/2018 - 05:16

వరంగల్,మార్చి 29: బావ, మరదలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భీమారంలో జరిగింది. గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలను కేయు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌బాబు వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి, ఆయన భార్య ప్రతిభ ఉద్యోగరీత్యా భీమారంలో గత కొంతకాలం నుంచి ఉంటున్నారు.

03/30/2018 - 05:10

కేసముద్రం, మార్చి 29: వరంగల్ నగర సమీపంలో గురువారం రైలు కింద ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేసముద్రం మండలం ఇనుగుర్తిలో విషాదం అలముకుంది. మృతుల్లో ఒకరైన కె.మహేష్ (32) రెండేళ్ల వయసులో తండ్రి ఈశ్వరయ్య చనిపోవడంతో ఇనుగుర్తికి వలస వచ్చి తన మేనమామ ఆనందపు సోమేశ్వర్ చెంత ఉండి 10వ తరగతి వరకు ఇనుగుర్తిలో విద్యాభ్యాసం పూర్తి చేశాడని గ్రామస్థులు తెలిపారు.

Pages