S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘గీతాంజలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి పేరుతెచ్చుకున్న రాజ్కిరణ్ మరొక థ్రిల్లర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ నందిత టైటిల్ రోల్ చేయనుంది. ఒకప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు చేసే దర్శకులకు, నిర్మాతలకు ఫేవరెట్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఈమధ్య సరైన హిట్ లేక వెనుకబడిపోయింది.
కేరింత చిత్ర హీరో సుమంత్ అశ్విన్.. నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువిక్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. దర్శకుడు లక్ష్మణ్ కార్య. ఈ చిత్ర కథానాయకుడు సుమంత్ అశ్విన్ బర్త్డే సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా.. నిహారిక మాట్లాడుతూ..
నారా రోహిత్, జగపతిబాబు, దర్శనా బానిక్ ముఖ్య పాత్రల్లో పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్పై వాసిరెడ్డి రవీంద్రనాధ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, ముక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ఈ సినిమా ట్రైలర్ హైదరాబాద్లో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం నారా రోహిత్ మాట్లాడుతూ- ఇదొక థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ మూవీ.
దర్శకుడు తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్ర స్పెషల్ షోలో వీరిద్దరూ కలవడం జరిగింది. ఇద్దరు దర్శకులు ‘ఈ నగరానికి ఏమైంది’ ‘సంజు’ చిత్రాల గురించి ముచ్చటించుకోవడం జరిగింది. తరుణ్భాస్కర్ తీసిన చిత్రాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ‘సంజు’ చిత్రం బాలీవుడ్ నటుడు సంజయ్దత్ జీవితకథ ఆధారంగా రూపొందించబడింది.
‘ప్రేమమ్’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను తన ప్రేమలో పడేసింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్. ఆ సినిమాతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిన ఈ బ్యూటీవరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా తేజ్ ఐ లవ్ యు చిత్రంలో నటిస్తోంది.
హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దర్శకులు సుకుమార్, కొరటాల శివ, చంద్రశేఖర్ యేలేటి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్కొట్టగా, డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్కు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు.
ఇటీవల ‘మళ్ళీ రావా’ వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుమంత్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టారస్ సినీకార్పు, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ పతాకాలపై బీరం సుధాకర్రెడ్డి మరియు ధీరజ్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వసిస్తున్నారు. ఈషా కథానాయికగా నటిస్తున్నది.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న అత్యంత భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం సాహో. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే 90 కోట్ల భారీ వ్యయంతో దుబాయ్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్మెన్ కెన్ని బేట్స్ పర్యవేక్షణలో జరిగిన ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు.
నట యశస్విగా పేరు పొందిన ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా నటించి వెండితెరపై తనదైన ముద్ర వేశారు. ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతిగాంచారు.
గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో సత్య సాయి ఆర్ట్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం పంతం. ఫర్ ఎ కాజ్ అనేది ఉపశీర్షిక. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- గోపీచంద్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి సోషల్ మెసేజ్తో అందిస్తున్నాం. దర్శకుడు చక్రవర్తి అద్భుతమైన కథను చెప్పాడు.