S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్చంద్ర, గాయత్రీ సురేష్ హీరోహీరోయిన్లుగా ‘అడ్డా, ఓటర్’చిత్రాల దర్శకుడు జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మనె్న నిర్మిస్తున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భార్గవ్ మనె్న మాట్లాడుతూ.. దర్శకుడు కార్తీక్ మంచి కథ చెప్పారు.
అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి సన్నాహాల మొదలుపెట్టాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ అవ్వడంతో తదుపరి విషయంలో కాస్త ఆలోచనలో పడ్డాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మనం ఫేమ్ విక్రమ్ కుమార్తో చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా ఫస్ట్ షోనుండి పాజిటివ్ టాక్తో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. నిర్మాత సురేష్బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్తోపాటు చిత్ర నటీనటులు పాల్గొన్నారు. అలాగే కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్ర యూనిట్, ఆ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా పాల్గొన్నారు. ఈ చిత్ర పోస్టర్ను నిర్మాత సురేష్బాబు విడుదల చేసారు.
లార్డ్స్ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై యువ నిర్మాత నారాయణరామ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒకటే లైఫ్’ హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం ఆడియో విడుదలైంది. బి.జె.పి. అధికార ప్రతినిధి రఘునందనరావు ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సూపర్గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి కుమారుడు రమేష్చౌదరి హీరోగా నటిస్తున్నారంటే.. దీనిని సూపర్ గుడ్ కుటుంబంగా భావించవచ్చును.
వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న గ్లామర్ భామ మెహ్రీన్ కౌర్ టాలీవుడ్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం గోపీచంద్ సరసన పంతం సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడి క్రేజ్ పెరిగిన నేపథ్యంలో తన రెమ్యూనరేషన్ పెంచేసిందట. ప్రస్తుతం ఈ అమ్మడు 70 లక్షలు ఇస్తే తప్ప కొత్త అవకాశాలు ఒప్పుకోవడం లేదట. ఇప్పటివరకు అరకోటికే సినిమాలు చేసిన ఈ భామ తాజాగా రెమ్యూనరేషన్ పెంచేయడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. అంతేలే..
మాజీ మిస్టర్ ఆంధ్రా బాల్వాన్, ప్రాచి అధికారి హీరోహీరోయిన్లుగా మజ్ను సోహ్రబ్ మూవీస్ పతాకంపై మజ్ను రెహానాబేగం మజ్ను సోహ్రబ్ నిర్మాతలుగా ఎస్కె మజ్నును దర్శకుడిగా పరిచయంచేస్తూ నిర్మిస్తున్న లవ్ అండ్ హార్రర్ చిత్రం ‘ప్రేమసౌధం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్ఎంఎం ఖాజా మాట్లాడుతూ..
కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా కెపిడబ్ల్యూ బ్యానర్పై అశోక్రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
అర్జున్రెడ్డి చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’. ప్రొడ్యూసర్ బన్ని వాసు నిర్మాణంలో ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఎస్.ఎన్.ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో ఎస్.ఎన్.చిన్న స్వీయ పర్యవేక్షణ మరియు అల్వాల శేఖర్, కుండె కుమార్ నిర్మాణ సారధ్యంలో ‘జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో’ వాల్యూం 2 ఆడియో విడుదల ప్రసాద్ ల్యాబ్లో జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి టైటిల్రోల్ పోషిస్తున్న యాత్ర సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా జరుపుకుంటుంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైఎస్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు జగపతిబాబు నటిస్తున్నట్ట తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న రాజారెడ్డిని అప్పట్లో కల్వర్టు దగ్గర బాంబు పేల్చి చంపేశారు.