S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సుమంత్ కథానాయకుడిగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కొత్త చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆకాంక్షసింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా రూపొందిస్తున్నారు. ప్రారంభోత్సవ సన్నివేశానికి నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్నివ్వగా, సావిత్రి కెమెరా స్విచ్చాన్ చేశారు.
చిత్తోర్కోట కేంద్రంగా 1303లో మెహర్ రాజ్యాన్ని పరిపాలించిన రాణా రవల్ రతన్సింగ్ సతీమణి రాణి పద్మావతి. ఆమె పేరు చారిత్రక ఆధారాల్లో ‘పద్మావత్’గా ఉంది. ఢిల్లీని పరిపారిస్తున్న చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ మెహర్ రాజ్యాన్ని వశం చేసుకోవాలని నిర్ణయించాడు.
ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు మా అబ్బాయి అనే మాటను తరచూ వాడుతుంటారు. మనం కూడా వింటూనే ఉంటాం. అలాంటి సాధారణ అబ్బాయి కధే ‘మా అబ్బాయి’ అని నిర్మాత బలగా ప్రకాశరావు తెలిపారు. శ్రీవిష్ణు, చిత్రశుక్ల జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో వెనె్నల క్రియేషన్స్ పతాకంపై ఆయన రూపొందించిన చిత్రం ‘మా అబ్బాయి’ ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత పలు విశేషాలు తెలిపారు.
బాలీవుడ్లో సంచలన దర్శకుడిగా పేరుపొందిన సంజయ్లీలా భన్సాలీ రాణి పద్మావతి కథను వెండితెరకెక్కించాలని నిర్ణయించారు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్తో కలసి ఆయన చిత్ర నిర్మాణానికి ముందుకువచ్చారు. గత ఏడాది జూన్లో షూటింగ్ ప్రారంభించారు. ఈఏడాది నవంబర్ 17న సినిమాను రిలీజ్ చేయాలన్నది ఆయన లక్ష్యం.
శత్రుఘ్న రాయపాటి, స్ట్ఫోనీ జోసెలిన్ ప్రధాన తారాగణంగా రమ్స్ దర్శకత్వంలో శ్రీనివాస్ గుప్తా, మోహర్.ఆర్.నరసింహ, నాగశ్రీనివాసరెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘గ్రీన్కార్డ్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్లో బుధవారం జరిగింది.
పవన్, కారుణ్య, రాకేష్, ఆశ ప్రధాన పాత్రల్లో సమకాలీన సమస్యల నేపథ్యంలో కథల్ని రూపొందించి వెండితెరపై ఆవిష్కరించే దర్శకుడు పి.సునీల్కుమార్రెడ్డి. ఆయన సంధిస్తున్న మరో వ్యంగాస్త్రం ‘ఏటిఎమ్’. వర్కింగ్. కిశోర్ బసిరెడ్డి, యెక్కలి రవీంద్రబాబు నిర్మాతలు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో దర్శకుడు సునీల్కుమార్ రెడ్డి పాత్రికేయులతో చిత్ర విశేషాలు తెలిపారు.
ఆ గ్లామర్ భామ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్లు కొట్టేస్తూ.. మరోవైపు యువ హీరోల సినిమాలను వదలకుండా దూసుకుపోతోంది. ఇప్పుడు ఈమెకు టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇలా హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ మరోవైపు ఐటెం సాంగ్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట! ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా... ఎన్టీఆర్?
ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న పవన్కల్యాణ్ చిత్రం ‘కాటమరాయుడు’ సెన్సార్ తేదీని ఫిక్స్ చేసుకుంది. సినీ సర్కిల్స్ సమాచారం ప్రకారం మార్చి 15న సెన్సార్ కార్యక్రమం జరగనుంది. అలాగే ఇటలీ షెడ్యూల్ పూర్తవడంతో సినిమా షూటింగ్ మొత్తం ముగియనుంది. అందుకే చిత్ర యూనిట్ ఇంతకుముందే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి ముగింపు దశకు తీసుకొచ్చింది.
నాగచైతన్య పూర్తిగా రూట్ మార్చాడు. సాదా సీదా సినిమాలు చేస్తే ఇక లాభం ఉండదని గ్రహించిన ఈ అక్కినేని హీరో తన సినిమాల్ని పూర్తి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అలా చేసి గతంలో ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి వాటితో మంచి విజయాలనందుకుని ఇప్పుడు కూడా అదే పంథాని ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం చైతు కల్యాణ్కృష్ణతో ఒక ప్రాజెక్టు, కృష్ణ మరియముత్తుతో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ ఏడాది నందమూరి బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు క్రిష్. బాలయ్యను ఎలా చూపించాలో బాగా తెలిసిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత క్రిష్, వెంకటేష్తో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. అందులో భాగంగా ఓ నవలను సినిమా తీయాలని సన్నాహాలు చేశాడు. ఆ నవల ఏదో తెలుసా? ‘అతడు అడవిని జయించాడు’. ఈ నవలను కేశవరెడ్డి రచించాడు.