S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వెంకీ, లాస్య జంటగా పియుకె ప్రొడక్షన్స్ పతాకంపై ఎల్.రాధాకృష్ణ దర్శకత్వంలో దీపక్ కృష్ణ రూపొందించిన చిత్రం ‘తొలి పరిచయం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో గురువారం ఉదయం ప్రసాద్ లాబ్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో నిఖిల్ ట్రైలర్ను విడుదల చేశారు.
పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా వచ్చిన ‘బద్రి’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ అమీషా పటేల్.. ఆ తరవాత పలు చిత్రాల్లో నటించింది. అయితే కమర్షియల్గా టాలీవుడ్లో సక్సెస్ కాలేకపోయింది. అందుకే బాలీవుడ్లోనే సెటిల్ అయింది. అక్కడ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ తెచ్చుకుంది. నలభై ఏళ్లు వచ్చినా హీరోయిన్ పాత్రలకోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పెళ్లి గురించి పెద్దగా ఆలోచించని అమీషా..
రాజ్యలక్ష్మి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పావని, పరమేష్ యోధా, సాంబ, కిరణ్ ప్రధాన తారాగణంగా రాజ్యలక్ష్మి.సి, నర్సింములు పటేల్ చట్టి రూపొందిస్తున్న చిత్రం ‘లావణ్య విత్ లవ్బాయ్స్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్నివ్వగా చంద్రశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.
అఖిల్ హీరోగా రూపొందిన ‘అఖిల్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సయేషా. ఈ చిత్రం నిరాశపర్చడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అజయ్ దేవ్గన్తో ‘శివాయ్’ చిత్రంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించుకుంది. సయేశా ఇప్పుడు కోలీవుడ్లో అడుగుపెట్టింది. ‘జయం’ రవి సరసన హీరోయిన్గా నటిస్తోంది.
పవర్స్టర్ పవన్కళ్యాణ్-త్రివిక్రమ్ కలయికలో కొన్ని రోజుల క్రితం ఒక సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరి గత సినిమాలు జాల్సా, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు భారీ విజయాలుగా నిలవడంతో ఈ సినిమాపై కూడా పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠతో అభిమానులు ఉన్నారు.
పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న భారత వీరులు నిజంగా హీరోలని నటుడు రానా అన్నారు. ఈనెల 17న ఘాజీ ఎటాక్ చిత్రం విడుదల సందర్భంగా ఆయన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాల్లో ఆసక్తికర అంశాలను రానా ప్రస్తావించారు.
లేటెస్టుగా ‘ఖైదీ నెం 150’ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు వినాయక్. మిగతా స్టార్ హీరోలు అందరూ కమిట్మెంట్తో ఉండడంతో వినాయక్ తరువాతి సినిమా ఏమిటా? అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఇప్పటికే సాయిధరమ్తేజ్తో ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అది వర్కవుట్ అయ్యేలా కనిపించడంలేదు. ఐతే ప్రస్తుతం వినాయక్ మెగా క్యాంప్ నుంచి నందమూరి ఫ్యామిలీకి షిప్ట్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.
రానా దగ్గుబాటి, తాప్సి ముఖ్యపాత్రల్లో ఇండియా-పాక్లమధ్య సముద్రంలో నడిచిన వాస్తవ యుద్ధ కథనం ఆధారంగా రూపొందిన చిత్రం ఘాజి. ఇండియన్ స్క్రీన్పై ఈ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఎక్కువైంది. ఈ చిత్రం ఈనెల 17న విడుదల అవుతున్న సందర్భంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి చెప్పిన విశేషాలు..
ఘాజి ఆలోచన
యాభై ఏళ్లు దాటినా ఇంకా తన అందచందాలతో
అలరిస్తున్న శ్రీదేవి
మరోసారి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.
ఇటీవల కొత్త దుస్తుల్లో తీయించుకున్న
ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రఖ్యాత డిజైనర్లు
సవ్యసాచి, మనీష్ మల్హోత్ర రూపొందించిన దుస్తుల్లో ఆమె
మెరిసిపోయింది.
సుమన్ ప్రధాన పాత్రలో శ్యాం, శ్రీకీర్తిక హీరో హీరోయిన్లుగా నవ్య మూవీ మేకర్స్ పతాకంపై తోట కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీలంపాటి అమ్మోరు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా డిఐ, గ్రాఫిక్స్ జరుపుతున్నారు.