గుంటూరు
పిడుగుపాటుకు మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 24 June 2017
గురజాల, జూన్ 23: పిడుగుపాటుకు గురై ఒక మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కధనం ప్రకారం..మండల కేంద్రమైన అచ్చంపేటలోమండలంలోని మాడుగుల గ్రామానికి చెందిన పాశం నాగేంద్రమ్మ (50) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు కూలికి వెళ్ళింది. అయితే పనులు ముగించుకుని సాయంత్రం తోటి కూలీలతో కలసి తిరిగి వస్తుండగా హఠాత్తుగా వర్షం కురిసి పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమెకు భర్త, కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతురాలి భర్త సైదయ్య ఫిర్యాదు మేరకు గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.