బిజినెస్

‘మన్ కీ బాత్’తో రూ. 10 కోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నెలనెలా రేడియోలో నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోకు దాదాపు 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ ఆదాయాన్ని ఆల్ ఇండియా రేడియో అందుకుంది. ఈ మేరకు సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోర్ ఓ లిఖితపూర్వక సమాధానంగా బుధవారం లోక్‌సభకు తెలియజేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 4.78 కోట్ల రూపాయలు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5.19 కోట్ల రూపాయల రెవిన్యూ వచ్చినట్లు మంత్రి సభకు వివరించారు. కాగా, ఇంగ్లీష్, సంస్కృతంతోపాటు 18 బాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఇంటర్నెట్, షార్ట్ వేవ్ ట్రాన్స్‌మీటర్ల ద్వారా కూడా భారీ సంఖ్యలో శ్రోతలు కార్యక్రమాన్ని వింటుంటారు. 2014 అక్టోబర్ 3న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్తమాన విషయాలపై మోదీ ఇందులో స్పందిస్తారు.