బిజినెస్

‘నేటి అర్ధరాత్రిదాకా పని చేయనున్న ఐటి ఆఫీసులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: శనివారం అర్ధరాత్రి వరకు ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు తెరిచే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో శుక్రవారం స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను వృద్ధులు, 5 లక్షల రూపాయల ఆదాయానికి దిగువన ఉన్నవారు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీని జూలై 31 నుంచి ఆగస్టు 5 వరకు పొడిగించినది తెలిసిందే. దీంతో అన్ని ఐటి శాఖ కార్యాలయాలు శనివారం అర్ధరాత్రి వరకు తెరిచే ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) విభాగం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.