పశ్చిమగోదావరి

రూ.1.30 కోట్ల బకాయిలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, డిసెంబర్ 10: కోట రామచంద్రపురం ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలో తాను చేసిన కాంట్రాక్టు పనులకు చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించకపోవడంతో ఆవేదన చెందిన గుత్తేదారు ఒకరు పురుగుల మందు డబ్బాతో పీవో కార్యాలయంలో హల్‌చల్ చేశారు. కోట రామచంద్రపురం ఐటీడీఏ వద్ద సోమవారం గిరిజన దర్బార్ సందర్భంగా వేలేరుపాడుకు చెందిన గుత్తేదారు యాళ్ల శంకరరావు తన ఆవేదనను పీవో హరీంద్రియప్రసాద్‌కు వినిపించారు. గత పీవో హయాంలో రూ.47 లక్షల రోడ్డు పనులు చేయగా ఇప్పటివరకు ఆ సొమ్ములు చెల్లించలేదని, దానిలో ఏడు లక్షలు మంజూరైనప్పటికీ చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పీవో ఆదేశాల మేరకు ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన రహదార్లకు రూ.83 లక్షల విలువైన మరమ్మతులు చేశానని, ఈ సొమ్ములు కూడా చెల్లించకుండా తనను ఆవేదనకు గురిచేస్తున్నారని తెలిపారు. తాను అప్పులు తీసుకువచ్చి, పెట్టుబడులు పెట్టి పనులు చేశానని, వెంటనే సొమ్ములు చెల్లించకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని గుత్తేదారు పురుగుల మందు డబ్బాను చూపించారు. గుత్తేదారు సమస్యపై స్పందించిన పీవో తొందరపడవద్దని, వారం రోజుల్లో బిల్లు మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో గుత్తేదారు శాంతించారు.