బిజినెస్
మెరిసిన బంగారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 26 April 2019
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: బులియన్ మార్కెట్లో బంగారం మెరిసింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పెరిగి, 33,020 రూపాయలకు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర 230 రూపాయలు మెరుగుపడి, 38,750 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయ బలియన్ మార్కెట్ సానుకూల ధోరణులను ప్రదర్శించిన నేపథ్యంలో దేశంలో నగల వ్యాపారులు బంగారం, వెండి కొనుగోలుపై ఆసక్తిని ప్రదర్శించారు. రూపాయి మారకం విలువ కొద్దిగా పతనం కావడం కూడా బులియన్ మార్కెట్లో పెట్టుబడులను పెంచాయి. విదేశీ బులియన్ మార్కెట్లు కూడా శుక్రవారం లాభాల బాటలో నడిచాయి.