విజయవాడ
దిశ చట్టం దేశానికే దిశా నిర్దేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 15 December 2019
విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 14: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రిలా ఆలోచించారని, పిల్లల రక్షణ కోసం పటిష్టమైన దిశ చట్టం రూపొందించారని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం 27వ డివిజన్ పర్యటనలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బాలికలు, యువతులు, మహిళలను ఏరకంగా వేధించినా, అత్యాచారాలకు పాల్పడినా కేవలం 21రోజుల్లో దోషులకు శిక్ష అమలయ్యేలా దిశ చట్టం- 2019ను రూపొందించామన్నారు. త్వరితగతిన విచారణ జరపడం, దోషుల నేరాన్ని బట్టి జీవిత ఖైదు, లేదా మరణశిక్ష పడేలా రూపొందించిన దిశ చట్టాన్ని శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. మహిళల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి వెలంపల్లి వివరించారు.