బిజినెస్
4 శాతం లాభపడిన ‘జిందాల్ ఉక్కు’ వాటాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 2 January 2020
న్యూఢిల్లీ, జనవరి 2: జిందాల్ ఉక్కు కర్మాగా రం (జేఎస్పీఎల్) వాటాలు గురువారం 4 శాతం లాభపడ్డాయి. గడచిన డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ముడి ఇనుమును తయారు చేసినట్టు ఆ కంపె నీ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్లో వాటాలను బలం చేకూరింది. బీఎస్ఈలో ఈ వాటాలు 4.27 శా తం లాభపడి ఒక్కో వాటా ధర 173.40కు చేరింది. ఇక జాతీ య స్టాక్ ఎక్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో ఈ వాటాలు 4.32 శాతం లాభపడ్డాయి. ఒక్కో వాటా ధర 173.60కు చేరింది. బీఎస్ఈలో మొత్తం 14 లక్షల వాటాలు ట్రేడవగా, ఎన్ఎస్సీలో 2కోట్ల వాటాలు చే తులు మారాయి. గత త్రైమాసికంలో ఈ కంపెనీ 1.61 మిలియన్ టన్నుల ముడి ఇనుమును తయా రు చేసింది.