విజయవాడ

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సదా సీఎం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మంత్రి పశ్చిమలోని గట్టు వెనుక ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయనను ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల సంఘాల నాయకులు కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తమకు ఉన్న రిజర్వేషన్‌లు ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతుందని, భారత రాజ్యాంగం ప్రకారం తమకున్న హక్కును కాలరాసేలా సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న అంశాన్ని సంఘ నాయకులు మంత్రి వెలంపల్లి ముందు వివరించగా దానికి ఆయన స్పందించారు. జగన్‌మోహన్‌రెడ్డి అనుకూలంగా ఉంటారని, తమ ప్రభుత్వం మద్దతు ఉంటుందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. కృష్ణాజిల్లా గిరిజన సంక్షేమ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మద్దెల రామకృష్ణ, దళిత సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోగిస కనకరాజు, జిల్లా కార్యదర్శి పంచకర్ల రామకృష్ణ, మైనార్టీ నాయకులు ఎస్‌కే ఖాజా తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా కప్పి సత్కరించారు.