బిజినెస్
పెట్రోల్ సెగ్మెంట్లోకి మహీంద్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 December 2015
ముంబయి, డిసెంబర్ 18: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. పెట్రోల్ తయారీ కార్ల రంగంలోకి అడుగుపెట్టింది. కెయువి 100 ఎస్యువితో మహీంద్ర సంస్థ తమ తొలి పెట్రోల్ ఆధారిత కారును తీసుకొస్తోంది. జనవరి 15న దీన్ని మార్కెట్కు పరిచయం చేస్తుండగా, ఈ మోడల్ పెట్రోల్తోపాటు డీజిల్తోనూ నడవనుంది. దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ వాహనాలపై వచ్చే ఏడాది మార్చిదాకా సుప్రీం కోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో ఇప్పటిదాకా కేవలం డీజిల్ ఆధారిత కార్లనే ఉత్పత్తి చేసిన మహీంద్ర.. పెట్రోల్ సెగ్మెంట్లోకి రావాల్సి వచ్చింది.