జగన్ పాదయాత్రకు స్పందన కరవు
Published Monday, 20 November 2017రాజమహేంద్రవరం, నవంబర్ 19: వైఎస్సార్సిపి అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఆపార్టీ పరిస్థితి, జగన్ వైఖరి చూసి పార్టీ శ్రేణులు క్రమంగా జారిపోతున్నాయన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక 42వ డివిజన్లోని శ్రీరామ్నగర్లో జరిగింది. ఈసందర్భంగా గుడా చైర్మన్ గన్ని కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో, అనంతరం విలేఖర్లతో నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పాదయాత్రలో ప్రతిపక్షనేత జగన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు.