S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గెలిచినా ఇంటికే..

సిడ్నీ, మార్చి 13: ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌ని వర్షం కూడా వెంటాడింది. డక్‌వర్త్ లూయిస్ విధానం ద్వారా ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 101 పరుగులు సాధించాల్సి ఉండగా, మరో 41 బంతులు మిగిలి ఉండగానే, కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. అయితే, భారీ విజయాన్ని నమోదు చేసినప్పటికీ ఈ జట్టు ఇంటిదారి పట్టక తప్పలేదు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 36.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. షఫీకుల్లా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

నిగ్గుతేలిన బొగ్గు మరక

అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య

సౌభాగ్యముల్-అన్న కవివాక్కులు మాజీ

ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో ఇలా

ధ్రువపడింది. పదేళ్లపాటు ప్రధానమంత్రిత్వం

వహించిన అంతర్జాతీయ స్థాయి అర్థికవేత్త

అపరాధం చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు

లభించడం మన ప్రజాస్వామ్య చరిత్రలో మరో

విపరిణామం. బొగ్గు బొరియల-కోల్‌బ్లాక్స్-ను

ప్రభుత్వేతర సంస్థలకు, బహుళ జాతీయ

వాణిజ్య సంస్థలకు కేటాయించడంలో జరిగిన

ఘోరమైన అక్రమాలలో మన్మోహన్

భాగస్వామ్యం లేదన్న వాదం న్యాయస్థానాల్లో

వీగిపోయింది. న్యాయస్థానం నిర్ధారించిన

నా ఓటమికి భారత్ కారణం: రాజపక్స

కొలంబో, మార్చి 13: అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి భారత్ సహా అమెరికా, యూరోపియన్ దేశాలే కారణమని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స ఆరోపించారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు అమెరికన్లు, నార్వేయన్లు, యూరోపియన్లతో పాటు భారత్‌కు చెందిన ‘రా’ కూడా కారణమని, ఇది బహిరంగ రహస్యమని ఆయన స్పష్టం చేశారు. హాంకాంగ్‌కు చెందిన దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనను ఎన్నికల్లో ఓడించేందుకు అమెరికా, భారత్‌లు తమ ఎంబసీలను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా శ్రీలంకలో పర్యటించనున్న సమయంలో రాజపక్స ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఉగ్రవాదంపై పోరులో కలిసి సాగుదాం

కొలంబో, మార్చి 13: భారత్, శ్రీలంక దేశాల భద్రత విడదీయలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, కీలకమైన సముద్ర జలాల రక్షణ, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో తమ రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమని నొక్కి చెప్పారు. మూడు దేశాల పర్యటనలో చివరి మజిలీగా శ్రీలంక చేరుకున్న మోదీ శుక్రవారం ఆ దేశ పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ, శ్రీలంక సమైక్యత, సమగ్రత భారత దేశానికి అత్యంత ప్రధానమైనవని, దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రజలు మార్పును, సమన్వయాన్ని ఆశిస్తున్నారనే విషయానికి అద్దం పడుతున్నాయని అన్నారు. శ్రీలంక పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానుల్లో మోదీ నాలుగోవారు.

డిశ్చార్జి అయిన గుండె మార్పిడి రోగులు

హైదరాబాద్, మార్చి 13: అరుదైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఇద్దరు మహిళా రోగులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు రోగులూ బ్రెయిన్‌డెడ్ కేసుల్లో అవయవ దానం వల్ల పునర్జన్మ పొందినవారే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్ రావు, వైద్యులు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, శశికాంత్ విలేఖరులతో మాట్లాడారు.

మూడు నెలల్లో కొత్త ‘ఇసుక పాలసీ’

హైదరాబాద్, మార్చి 13: రానున్న రెండు, మూడు నెలల్లో ఇసుక తరలింపునకు సంబంధించి ప్రత్యేక పాలసీని అమలు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు శాసన మండలిలో శుక్రవారం వెల్లడించారు. ఇసుకను అక్రమంగా తరలించే విషయంపై టిడిపి సభ్యులు అరికెల నర్సారెడ్డి, పొట్ల నాగేశ్వర్‌రావు సభాముఖంగా అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు యంత్రాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇసుక తవ్వకం, తరలింపునకు సంబంధించి ఓ ప్రత్యేకమైన పాలసీని రూపొందించామని తెలిపారు.

డబ్బు డ్రా చేసుకొని వెళుతుండగా చోరీ

విశాఖ:నగరంలోని నెహ్రూ చౌక్‌ సమీపంలో ఓ వ్యక్తి బ్యాంకు నుంచి 60 వేల రూపాయలు డ్రా చేసుకొని వెళుతుండగా గుర్తుతెలియని దుండుగులు బ్యాగ్‌ను లాక్కెళ్లారు.

ఎస్‌బీఐ మేనేజర్ దుర్మరణం

విజయవాడ:కృష్ణాజిల్లా కైకలూరు మండలం పల్లెవాడ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ మూర్తి మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

హైదరాబాద్, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం విధాన మండలి ప్రవేశపెట్టింది. రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటునిచ్చే కీలకమైన రంగమని, రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా రూపుదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్యం తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు. సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రైవేటు భాగస్వామ్యంను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 45 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు.

నేటి నుంచి భక్తులకు ముందస్తు వసతి సౌకర్యం

తిరుపతి, మార్చి 13: వేసవికాలం నేపధ్యంలో శ్రీవారిని దర్శించుకోడానికి తిరుమలకు వచ్చే భక్తులకు వసతి పొందే సులభ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శనివారం నుంచి ముందస్తు వసతి సౌకర్యాలు పొందే సౌకర్యం కల్పిస్తున్నారు. ఏప్రిల్ పది నుంచి ఇ-దర్శన్ కౌంటర్లలోను, ఏప్రిల్ 14 నుంచి ఇంటర్నెట్ ద్వారా భక్తులు వసతి సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు టిటిడి రంగం సిద్ధం చేస్తోంది.

Pages