ప్రజా ఫిర్యాదులు వినరాదు
Published Monday, 16 January 2017న్యూఢిల్లీ, జనవరి 15: ఎన్నికలు ముగిసే దాకా అయిదు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, మంత్రులు, చట్టబద్ధ సంస్థల్లో నియమించబడిన రాజకీయ నాయకులు జనం దాఖలు చేసే ఫిర్యాదులను వినకూడదు. ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలు ఓటర్లపై నేరుగా ప్రభావం చూపిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.