విద్యుదాఘాతానికి ఇద్దరు బలి
Published Monday, 26 September 2016ఇచ్చోడ, సెప్టెంబర్ 26: నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో బీడీ కార్మికురాలు బండి రుక్మ (40), శివాజీ బీడీ కంపెని యజమాని ఎర్రన్న (50) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... బండి రుక్మ అనే బీడీ కార్మికురాలు సోమవారం ఉదయం తాను తయారుచేసిన బీడీలను తీసుకొని కంపెనీకి వెళ్తుండగా కంపెనీ సమీపంలోని విద్యుత్ తీగ (సర్వీస్ వైర్) ఆమెపై పడింది.