S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుదాఘాతానికి ఇద్దరు బలి

ఇచ్చోడ, సెప్టెంబర్ 26: నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో బీడీ కార్మికురాలు బండి రుక్మ (40), శివాజీ బీడీ కంపెని యజమాని ఎర్రన్న (50) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... బండి రుక్మ అనే బీడీ కార్మికురాలు సోమవారం ఉదయం తాను తయారుచేసిన బీడీలను తీసుకొని కంపెనీకి వెళ్తుండగా కంపెనీ సమీపంలోని విద్యుత్ తీగ (సర్వీస్ వైర్) ఆమెపై పడింది.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సిఎం

కడెం, సెప్టెంబర్ 26: ఎన్నికల సమయంలో కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపి రాథోడ్ రమేష్ ఆరోపించారు. సోమవారం హరిత రిసార్ట్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కెసిఆర్ అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు అందించలేకపోయారన్నారు. యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లు వేయడంతో విఫలమైందన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు మంజూరుచేయకపోవడంతో విద్యార్థుల అవస్థలు అంతా ఇంతకాదన్నారు.

తగ్గని వరద ఉద్ధృతి

మంచిర్యాల, సెప్టెంబర్ 26: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ఉదృతి కొనసాగుతోంది. ఎగువ కురిసిన వర్షాలు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేతతో సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు భారీగా చేరడం వల్ల ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తివేయడంతో 3.92లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వొదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 3.80లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం 147.2 మీటర్లు ఉంది.

వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

దివ్యనగర్, సెప్టెంబర్ 26: భారీ వర్షాల మూలంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం దిలావర్‌పూర్ మండలంలోని గుండంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద జిల్లా ప్రత్యేకాధికారి వికాస్‌రాజ్, కలెక్టర్ జగన్‌మోహన్‌తో కలిసి పత్తి, మిరప, సోయాబీన్, వరి పంటలను పరిశీలించారు. అనంతరం లోలం గ్రామంలో వర్షాల మూలంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాకు నియమితులైన ప్రత్యేకాధికారి వికాస్‌రాజ్‌కు వరదనష్టం వివరాలను వివరించారు.

వరద విపత్తుపై అప్రమత్తంగా ఉండండి

ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెరువులు, కుంటలు, జలాశయాలు తెగి పోకుండా ముందస్తు చర్యలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలో జరిగిన భారీ వర్షాలతోసంభవించిన వరద నష్టంపై మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి నిర్మల్, ఆదిలాబాద్ నియోజక వర్గాలను సందర్శించారు. సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా శాఖల అధికారులతో వరదనష్టం అంచనా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆందోళన వద్దు అన్ని విధాల ఆదుకుంటాం

దిలవార్‌పూర్, సెప్టెంబర్ 26 : ఇటీవల కురిసిన బారీ వర్షాలకు నష్టపోయిన రైతులను,బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.మండలంలోని గుండంపెల్లి ఎక్స్ రోడ్డు వద్ద రైతులు నష్టపోయిన పంట పోలాలను, లోలంలో కూలీన ఇండ్లను సోమవారం మంత్రి అల్లోల ప్రత్యేకాధికారి వికాస్ రాజ్‌తో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు బాసటగా నిలుస్తామని భాదితులకు భరోసానిచ్చారు. విస్తారంగా వర్షాలు కురవడం సంతోషదాయకమైనప్పటికి చేతికందే పంటలు నష్టపోవడం బాధకరమన్నారు.

కొత్త జిల్లాలకు ముందే పెండింగ్ ఆర్జీలకు పరిష్కారం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: నూతన జిల్లాల ఏర్పాటుకు ముందే డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి అందిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జెసి సుందర్ అబ్నార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెసి అధ్యక్షతన డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 15 మంది వారి వారి సమస్యలను ఫోన్‌ద్వారా జెసికి వివరించారు.

6,250 ఎకరాల్లో పంట నష్టం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహించగా జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నిండు కుండలా తలపిస్తున్నాయి. ఈనెల 23, 24 తేదీల్లో ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ మహారాష్ట్ర నుండి జిల్లాను తాకిన వరద నీటి ప్రవాహంతో గోదావరి ఉదృతరూపం దాల్చింది. అయితే గత పది సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా కురిసిన వర్షాల వల్ల ఎస్సారెస్పీతో పాటు కడెం, సాత్నాల, స్వర్ణ, మత్తడివాగు, సుద్దవాగు, కొమరంభీం ప్రాజెక్టు, నిల్వాయి, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడం రైతుల్లో ఆనందం కల్గించింది.

భారీ వర్షం..్భరీ నష్టం

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26: జిల్లాలో గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాది వర్షాలు లేక కరువులో కొరల్లో చిక్కుకున్న రైతులకు ఈ ఏడాది వర్షాలు సంవృద్దిగా కురిశాయి. ఆశించిన మేర వర్షాలు కురిసినా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురియడంతో రైతులు కుదేలైయ్యారు. వర్షాలు కురిసిన ఆనందం మరవకముందే నష్టాలు తమదరి చేరడంతో రైతులు లాబోదిబోమంటున్నారు. భారీగా సాగుచేసిన మొక్కజోన్న, జోన్న, కంది, పత్తి, ఆముదం, పెసర, మినుము పంటలు రైతులకు నిరాశే మిగిలింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావం జిల్లా తీవ్రంగా చూపింది.

పాలమూరులో భారీ వర్షం

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26: జిల్లా కేంద్రమైన పాలమూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా కేంద్రంలోని పలు రోడ్లు చెరువులను తలపించాయి. ముఖ్యంగా జడ్చర్ల నుండి రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు, నాళాలు నిండి పొంగిపొర్లాయి. ముఖ్యంగా న్యూటౌన్‌లో భారీ వర్షానికి పెద్ద చెరువుకు వెళ్లే కాలువ నిండుకుండలా పారింది. న్యూటౌన్‌లో రోడ్డుపై మూడు నాలుగు ఫీట్ల ఎత్తులో వర్షపునీరు వచ్చి చేరి వరదలా ప్రవహించింది. దింతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Pages