-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
లండన్, జూలై 1: ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న అగ్నీస్కా రద్వాన్స్కా ఇక్కడ జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ టైటిల్పై అశలు పెట్టుకుంది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ను ఓడించి టైటిల్ సాధించిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి గార్బినె ముగురుజా రెండో రౌండ్లోనే ఓటమిపాలై నిష్క్రమించడంతో రద్వాన్స్కా విజయావకాశాలు మెరుగుపడ్డాయి.
మార్సెల్లీ, జూలై 1: యూరో 2016 సాకర్ చాంపియన్షిప్లో పోర్చుగల్ అతి కష్టం మీద సెమీ ఫైనల్స్ చేరింది. పోలాండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యంకాగా, పోలాండ్ 5-3 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణమే దాడికి ఉపక్రమించిన పోలాండ్కు రెండో నిమిషంలోనే రాబర్ట్ లావెండోవ్స్కీ గోల్ను సంపాదించిపెట్టాడు.
మాస్కో, జూలై 1: రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని తనకు ఇవ్వాలని కోరుతూ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్)కు రష్యా పోల్వాల్టర్ ఎలెనా ఇసిన్బయేవా దరఖాస్తు చేసుకుంది. వ్యూహాత్మక డోపింగ్కు పాల్పడుతున్నదన్న కారణంగా రష్యాను ఒలింపిక్స్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనితో ఆ దేశానికి చెందిన అథ్లెట్లు ఐఒసి పతాకం కింద పోటీపడాల్సి ఉంటుంది.
దిల్లీ: ఐసీసీలో మీడియా విభాగ అధికార ప్రతినిధి పదవికి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రవిశాస్త్రి రాజీనామా చేశారు. భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం ఆయనను ఇంటర్వ్యూ చేసిన బృందంలో గంగూలీ లేకపోవడాన్ని రవిశాస్త్రి తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాస్త్రి రాజీనామా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ ఆరేళ్ల నుంచి నేను ఆ పదవిలో కొనసాగుతున్నాను.
న్యూఢిల్లీ, జూన్ 30: భారత క్రికెట్ ప్రక్షాళనకు, పారదర్శక పాలనకు లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడంపై తీర్పును సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వాదోపవాదాలు పూర్తికాగా, తీర్పును ప్రకటించలేదు. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు ఇది వరకే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సూచించిన విషయం తెలిసిందే. అయితే, అందులోని పలు అంశాలు ఆచరణ యోగ్యం కావంటూ బిసిసిఐ వాదించింది.
న్యూఢిల్లీ, జూన్ 30: భారత క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) సభ్యుడిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్కు పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని వచ్చిన ఆరోపణలు నిరాధారమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఇంటర్వ్యూలో జరిగినప్పుడు ఈ కమిటీలోని ఇతర ఇద్దరు సభ్యులు సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీతో కలిసి లక్ష్మణ్ పాల్గొనాల్సి ఉండింది.
జైపూర్, జూన్ 30: జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య గురువారం జరి గిన మ్యాజ్ టైగా ముగిసింది. ఇరు జట్లు చెరి 28 పాయంట్లు చేశాయ. చివరి క్షణం వరకూ ఎంతో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జైపూర్ తరఫున కెప్టెన్ జస్వీర్ సింగ్ తొమ్మిది పాయంట్లతో రాణించాడు. రాజే ష్ నర్వాల్ ఆరు పాయంట్లు చేశాడు. జైపూర్తో చివరి వరకూ పోరాడిన బెంగళూరుకు రోహిత్ కుమార్ ఆరు పాయంట్లు అందించాడు.
మొనాకో, జూన్ 30: బోస్టన్ మారథాన్ మాజీ చాంపియన్ లిడియా గ్రెగర్యెవాపై రెండున్నర సంవత్సరాల సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా ఆమెను సస్పెండ్ చేసినట్టు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ప్రకటించింది. 2007లో బోస్టన్ మారథాన్ టైటిల్ను గెల్చకున్న గ్రెగర్యెవా అంతకు ముందు ఏడాది జరిగిన యూరోపియన్ అథ్లెటిక్స్ మీట్ మహిళల 10,000 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
కాల్గరీ (కెనడా), జూన్ 30: కెనడా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ప్రీ క్వార్టర్స్కు చేరాడు. రెండో రౌండ్లో అతను 13-21, 21-11, 21-15 తేడాతో స్వీడన్కు చెందిన మథియాస్ బోర్గ్ను ఓడించాడు. మొదటి సెట్ను కోల్పోయిన్పప్పటికీ, మిగతా రెండు సెట్లలో అతను ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచాడు.
లండన్, జూన్ 30: కెరీర్లో 17 గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిళ్లను కైవసం చేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ఇక్కడ జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో మూడో రౌండ్ చేరాడు. రెండో రౌండ్లో అతను క్వాలిఫయర్ మార్కస్ విల్స్ను 6-0, 6-3, 6-4 తేడాతో సునాయాసంగా ఓడించాడు.