S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూలై 19: గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమ నిర్మాణాలు, అధికారుల విధుల నిర్వహణలో అలసత్వం.. ఫిర్యాదులు వచ్చినా చూసీ చూడనట్లుగా వ్యవహరించే అధికారులపై వేటు వేసేందుకు జిల్లా పంచాయతీ శాఖ నడుం బిగించింది.
శేరిలింగంపల్లి, జూలై 19: చందానగర్లోని పిజెఆర్ స్టేడియంలోజరుగుతున్న అభివృద్ధి పనులను గ్రేటర్ అడిషనల్ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు తనిఖీ చేశారు. స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డితోకలిసి అక్కడ జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సుమారు కోటిన్నర లక్షల అంచనా వ్యయంతోబాస్కెట్ బాల్, వాలీబాల్,క్రికెట్ గ్రౌండ్ నిర్మాణ పనులు, స్టేడియానికి పెయింటింగ్ పనులను చేపట్టారు.
హైదరాబాద్, జూలై 19: హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా జరుపుకోనున్న బోనాల పండుగ సందర్భంగా భారీ బందోబస్తు చేపట్టాం. మూడువేల మంది సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్, ఎక్సైజ్, జిహెచ్ఎంసి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
జగదాంబ, జూలై 19:ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కెజిహెచ్లో రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ప్రజా పద్దుల కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగైనా వైద్యసేవలందించేది అంటూ మండిపడింది. కమిటీ రెండవ రోజు పర్యటనలో భాగంగా చైర్మన్ రాజేంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో కెజిహెచ్, విజిహెచ్ ఆసుపత్రులను సందర్శించి అక్కడ అందుతున్న వైద్యసేవలపై ఆరాతీసింది. ఆయా ఆసుపత్రుల నిర్వహణలో సమస్యలు తెలుసుకుంది.
విశాఖపట్నం, జూలై 19: జిలాల్లో వివిధ కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలకు సంబంధించి దళారుల మాటలను నమ్మి మోస పోవద్దని జిల్లా న్యాయమూర్తి వి.జయసూర్య విజ్ఞప్తి చేశారు. జిల్లా కోర్టులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష ఈ నెల 31న జరుగనుందని తెలిపారు.
మునగపాక, జూలై 19: ఎన్నికల వాగ్ధానాలను అమలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైకాపా నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిది నాలుకా తాటిమట్టా అని యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఎద్దేవా చేసారు.
అరకులోయ, జూలై 19: రాష్ట్ర వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. జగన్ వ్యవహార శైలిని తక్షణమే మార్చుకోవాలని, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావుపై వక్రీకరించి వార్తా కధనాలు ప్రచురించరాదంటూ జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు.
అచ్యుతాపురం, జూలై 19: ఈ నెల 23వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూడిమడకలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న స్థలాలను జిల్లా కలెక్టర్ యువరాజ్ మంగళవారం పరిశీలించారు. హూదూద్ తుఫాన్లో నష్టపోయిన మత్స్యకారులకు పూడిమడక సమీపం వద్ద ఇన్ఫోసిస్ ఆర్థిక నిధులతో నిర్మిస్తున్న పక్కాగృహాలను ప్రారంభించడానికి సిఎం వస్తున్నారు.
జి.మాడుగుల, జూలై 19: నియంతృత్వ పోకడలతో, నిరంకుశ ఆలోచనలతో అధికార దాహంతో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి బాలరాజు అన్నారు. మంగళవారం జి.మాడుగుల జిల్లా పరిషత్ అతిధి గృహంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగేని చిన్నబాబు ఆచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు.
అచ్యుతాపురం, జూలై 19: అచ్యుతాపురం రోడ్డు విస్తరణ కూడలిని జిల్లా కలెక్టర్ యువరాజ్ మంగళవారం పరిశీలించారు. రోడ్డు విస్తర్ణ మ్యాప్ను పరిశీలించి అధికారులను పలువిషయాలను అడిగితెలుసుకున్నారు.