S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 23:44

ఆదిలాబాద్, జూలై 3: కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్రం కుంటిసాకులుచూపి కేంద్రంపై నిందలు మోపడం సరికాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయ్యనగారి భూమయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని బిసి భవనంలో మండల బిజెపి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు.

07/03/2016 - 23:44

మంచిర్యాల అర్బన్, జూలై 3: శనివారం బైంసాలో యువతి సంధ్యపై జరిగిన పైశాచిక దాడులను ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తోందని నాయకురాలు జ్యోతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశంలో మహిళలను పట్టపగలు హత్య చేయడమంటే ఈ ప్రజాస్వామ్య దేశమా లేక ఉన్మాదుల దేశమా అని ఆశ్చర్యపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిర్భయ చట్టం వచ్చినప్పటికీ స్ర్తిలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉందన్నారు.

07/03/2016 - 23:44

ఆదిలాబాద్, జూలై 3: జిల్లాలో ఊరిస్తూ వచ్చిన మార్కెట్ కమిటీ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోంది. జిల్లాలోని 17 మార్కెట్ కమిటీ పాలకవర్గాలకు రిజర్వేషన్లను ప్రకటించగా ఇప్పటికే పది మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియమాకాలకు ఎమ్మెల్యేలు పూర్తి ప్రతిపాదనలు నివేదించగా, ప్రభుత్వం చైర్మన్ పదవులను ఎమ్మెల్యే సూచించిన నేతలకు ఖరారు చేసింది.

07/03/2016 - 23:43

భైంసా రూరల్, జూలై 3: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి కార్యకర్తలందరూ కృషిచేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఉమ్మడి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని దారాబ్ది జిన్నింగ్ ఫ్యాక్టరీలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అధ్యక్షతన జరిగిన ముధోల్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.

07/03/2016 - 23:41

ఖమ్మం, జూలై 3: అంతా ఊహిస్తున్నట్లుగానే, పోరాటాలకు సంబంధం లేకుండానే జిల్లాల విభజనపై కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ తుది నివేదికను అందించనున్నారు.

07/03/2016 - 23:41

ఖానాపురం హవేలి, జూలై 3: చిరుత సంచరిస్తుందనే అనుమానంతో రఘునాథపాలెం మండలంలోని వి.వెంకటాయపాలెం గ్రామస్థులు ఆదివారం తీవ్ర ఆందోళన చెందారు. గతం వారం రోజులుగా సమీపంలోని పొలాల నుంచి ఓ జంతువు(చిరుత పులి) సంచరిస్తుందనే గ్రామస్థుల్లో ఉంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన శివకృష్ణ అనే వ్యక్తి అది గ్రామంలో నుంచి పొలాల్లోకి వెళ్తున్నట్లు గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు.

07/03/2016 - 23:40

భద్రాచలం, జూలై 3: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.4అడుగులకు చేరుకుని ఆదివారం సాయంత్రం నాటికి నిలకడగా కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు, గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధానంగా ఉపనదులు తాలిపేరు, ప్రాణహిత, ఇంద్రావతి సమీపంలోనూ విస్తారంగా వానలు తోడై శనివారం నాటికి నీటిమట్టం 20 అడుగులకు పెరిగింది.

07/03/2016 - 23:40

చండ్రుగొండ, జూలై 3: మండల పరిధిలోని అబ్బుగూడెం అడవుల్లో రెండు చిరుతపులులను హతమార్చిన సంఘటనపై కొత్తగూడెం డిఎఫ్‌ఓ శాంతారామ్ ఆదివారం విచారణ చేపట్టారు. అబ్బుగూడెం అడవులలో రెండు చిరుతపులులను హతమార్చిన విషయాన్ని శనివారం రాత్రి ఆంధ్రభూమి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈకథనంపై స్పందించిన అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

07/03/2016 - 23:39

కొత్తగూడెం, జూలై 3: చండ్రుగొండ మండలంలోని అబ్బుగూడెం అటవీప్రాంతంలో రెండు చిరుతల మృతికి విషప్రయోగమే కారణమని జిల్లా కన్జర్వేటర్ డాక్టర్ జి నర్సయ్య తెలిపారు. స్థానిక డిఎఫ్‌ఓ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిరుతలు మృతిచెంది దాదాపు నాలుగురోజులు గడిచి ఉంటుందన్నారు. చిరుతల మృతదేహాలపై చర్మం లేచిపోవడాన్ని బట్టి ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

07/03/2016 - 23:38

ఖమ్మం(ఖిల్లా), జూలై 3: పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదప్రజలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లించకపోవడంతో అసంపూర్తిగా మిగిలి, శిథిలావస్థకు చేరాయని పేర్కొన్నారు.

Pages