S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 00:58

కదిరి టౌన్, మే 19: కదిరి రూరల్ మండలం పట్నం గ్రామ సమీపంలో గురువారం ఉదయం 9గంటలకు జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సును కారు ఢీకొనడంతో కారులో ప్రయా ణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆంజనేయులునాయుడు (60), స్వరూప (47), రామయ్యనాయుడు (40), యసిత సాయి (14) నలుగురు దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.

05/20/2016 - 00:58

వజ్రకరూర్, మే 19:పగలంతా గొర్రెలు కాసి గ్రామ చివర పొలంలో గొర్రెలను నిలుపుకుని నిద్రిస్తున్న బోయ కదిరప్ప (65), లక్ష్మీదేవి (60)లు పిడుగుపాటుకు గురై మృతి చెందిన సంఘటన వజ్రకరూర్ మండలంలోని ఛాయాపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి మృతుని బందువులు, ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కదిరప్ప, లక్ష్మీదేవిలు గొర్రెలను మేపుకుని జీవనం సాగించేవారన్నారు.

05/20/2016 - 00:57

నల్లమాడ, మే 19: ఖరీఫ్ సాగు కోసం రైతన్నలకు ప్రభుత్వం అందజేస్తున్న విత్తన వేరుశెనగ పంపిణీ గురువారం అస్తవ్యస్తంగా జరిగింది. ముఖ్యంగా విత్తన పంపిణీలో ఎటువంటి అక్రమాలకు చోటివ్వకూడదన్న ఆలోచనతో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే ఈ విధానం అటు రైతన్నలకు, ఇటు అధికారులకు తలపోటుగా మారింది.

05/20/2016 - 00:57

అనంతపురం, మే 19:ఖరీఫ్ విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం జిల్లా మంత్రులు ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రామగిరి, చెనే్నకొత్తపల్లి మండల తహశీల్దార్ల కార్యాలయాల ఆవరణలోనూ, ఐటి, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమందేపల్లి మండలంలో ప్రారంభించారు.

05/20/2016 - 00:56

బ్రహ్మసముద్రం, మే 19: మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం కాంగ్రెస్ మండల కన్వీనర్ కోడిపల్లి బసవరాజు అధ్యక్షతన కరవుపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్, అనంతపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్జి అనీల్‌చౌదరి, అనంతపురం ఇన్‌చార్జి దాదాగాంధీలు పాల్గొన్నారు.

05/20/2016 - 00:56

ఉరవకొండ, మే19:జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగం గా గురువారం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఆ లయంలో సుప్రభాత సేవలో భాగంగా స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

05/20/2016 - 00:55

ధర్మవరం, మే 19: స్థానిక లక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మ రథోత్సవం గురువారం భక్తిప్రపత్తుల మధ్య సాగింది. అశేష జనవాహిని చేసిన గోవింద నామ స్మరణలతో ధర్మవరం హోరెత్తింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహరాజు నేతృత్వంలో ఈ వేడుకలు పర్వదినాన్ని తలపించాయి.

05/20/2016 - 00:55

హిందూపురం, మే19:తెలంగాణ లో తాజాగా అక్రమంగా నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టులు పూర్తయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మర ణ శాసనమే అవుతుందని ఎపి పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు భయపడే తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఎపి సిఎం చంద్రబాబునాయుడు వౌనం ఉంటున్నారని రఘువీరా ఆరోపించారు.

05/20/2016 - 00:54

అమరాపురం, మే 19:స్థానిక ఉన్నత పాఠశాలలో గురువారం వేరుశెనగ విత్తన పంపిణీని ఎమ్మెల్యే ఈరన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరవు పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సబ్సిడీతో వేరుశెనగ విత్తన కాయలను పంపిణీ చేయడం ఎంతో ఊరటనిస్తోందన్నారు. రైతులు విత్తన వేరుశెనగను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

05/20/2016 - 00:50

రెండేళ్ల క్రితం సంభవించిన మహా పరివర్తన ప్రభావం మరింతగా విస్తరించడం ఐదు శాసనసభల ఎన్నిల ఫలితాల ద్వారా ప్రస్ఫుటించిన అతిప్రధాన పరిణామం. అసోం ఎన్నికల ఫలితాలు ఈ విస్తృతికి ప్రతీకలు. పరివర్తన విస్తృతి వేగం ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలలో సమానంగా సంభవించకపోవడం సహజం.

Pages