S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 03:06

యానాం, మే 19: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో యానాం నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు వరుసగా ఐదోసారి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామిపై 8,762 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

05/20/2016 - 03:03

విజయవాడ , మే 19: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. అస్సాంలో అధికారాన్ని సాధించినందుకు, ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకొని, మెరుగైన ఫలితాలను సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీని, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను చంద్రబాబు అభినందించారు.
జయలలితతో మాట్లాడిన ఏపి సిఎం

05/20/2016 - 03:01

తిరువనంతపురం, మే 19: కేరళలో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యుడిఎఫ్ కూటమిని చిత్తుచేసి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో ఒక సారి గెలిచిన కూటమి మరోసారి గెలవకపోవడం అనే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ రాష్ట్రంలో మరోసారి పునరావృతమైంది.

05/20/2016 - 02:45

హైదరాబాద్, మే 19: ‘ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడితే సహించం. అక్రమాలు జరిగాయని, అవినీతి పాలనని నోటికొచ్చినట్టు మాట్లాడితే పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తాం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. చేసిన ఆరోపణలను నిరూపించనైనా నిరూపించాలి. లేనిపక్షంలో శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి.

05/20/2016 - 02:44

విజయవాడ, మే 19: సాంకేతికతను వినియోగించుకుంటూ రాష్ట్రంలో మరింత సమర్ధవంతగా, వేగవంతంగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ దిశగా గురువారం విజయవాడలోని తన కార్యాలయంలో జరిగిన ఐటి శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో పాలనపరంగా తీసుకోవాల్సిన సాంకేతిక మార్పులపై చర్చించారు.

05/20/2016 - 02:36

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పులనే ఇచ్చారు. అసోంలో తొలిసారి బిజెపికి పట్టం కట్టి చరిత్రను తిరగరాశారు. పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని సాగనంపారు. కేరళలో తొలిసారిగా బిజెపి ఖాతాతెరవడం మరో కీలక పరిణామం. జయ ఇంటికేనన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నివ్వెరపోయేలా అన్నాడిఎంకెను మళ్లీ అధికారంలోకి తెచ్చారు.

05/20/2016 - 02:36

దిల్లీ: తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరిగిందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గురువారం మీడియాకు తెలిపారు. అస్సాంలో కూటమిగా పోటీ చేసినప్పటికీ తమ పార్టీకి సొంతంగా మెజారిటీ లభించిందన్నారు. ఇక ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తాను దృష్టిపెడతానని ఆయన తెలిపారు.

05/20/2016 - 02:33

హైదరాబాద్, మే 19:ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీ హైదరాబాద్‌లో గురువారం మాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. యాపిల్ సిఇఓ టిమ్ కుక్, ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి మంత్రి కెటిఆర్, అధికారులు, ఐటి కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నానక్‌రామ్‌గూడలోని వేవ్ రాక్‌లో యాపిల్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

05/20/2016 - 02:30

హైదరాబాద్, మే 19:హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ మరోసారి బహిర్గతమైంది. టిఎస్‌ఐఐసి ద్వారా నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో నగరంలోని పలుచోట్ల పారిశ్రామిక, గృహ అవసరాల కోసం అమ్మిన భూమి గరిష్ట ధర పలికింది. ఖానామెట్‌లో ఎకరానికి 29 కోట్ల రూపాయల ధర పలికింది. కున్ మోటారెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 29 కోట్ల రూపాయల ధరతో రెండెకరాల స్థలం కొనుగోలు చేసింది.

05/20/2016 - 02:18

కైరో, మే 19: పారిస్ నుంచి కైరో వెళుతున్న ఈజిప్ట్ ఎయిర్ విమానం మధ్యధరా సముద్ర ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 26మంది విదేశీయులు సహా 66మంది ప్రయాణికులు మరణించారు. ఈజిప్టు ఎయిర్‌స్పేస్‌లోని రాడార్ స్క్రీన్లనుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ విమానం కనిపించకుండా పోయిందని విమానయాన అధికారులు తెలిపారు.

Pages