S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 01:41

విశాఖపట్నం(పరవాడ), సెప్టెంబర్ 24: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీపీసీ) రెండవ ఐదు వందల మెగావాట్ల విద్యుత్ యూనిట్‌లో సాంకేతిక లోపంతో శనివారం ఉత్పత్తి నిలిచి పోయింది. రెండవ యూనిట్‌కు సంబంధించిన బాయిలర్ ట్యూబ్స్‌లో సాంకేతిక లోపం తల్తెతడంతో సింహాద్రి అధికారులు రెండవ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమంయలో నిలిపి వేశారు.

09/25/2016 - 01:41

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: విదేశాలకు ఎగుమతులు చేసే ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత ముఖ్యమని ఎక్స్‌పోర్ట్స్ ఇనస్పెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్‌కె సక్సేనా పేర్కొన్నారు. ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో రెండోరోజు శనివారం జరిగిన టెక్నికల్ సెషన్స్‌లో భాగంగా రెగ్యులేటరీ రిక్వైర్‌మెంట్స్ ఆఫ్ సీ ఫుడ్ ట్రేడ్ అం శంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకే విదేశీ ఎగుమతులు జరగాలన్నారు.

09/25/2016 - 01:40

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందం కేసులో నిందితులయిన మలేసియా జాతీయులు టి.ఆనంద కృష్ణన్, ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్‌లను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశిస్తూ 2జి స్పెక్ట్రం కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు శనివారం వారెంట్లు జారీ చేసింది.

09/25/2016 - 01:39

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 24: వారంరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం తో వరినారు పోయడానికి రైతులు ఉత్సా హం చూపిస్తున్నారని, అయితే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ 15 కంటే ముందు వరినార్లు పోయకూడదని ప్రొఫెజర్ జయశంకర్ వ్యయసాయ వర్శిటీ శాస్తవ్రేత్త ఓ ప్రకటనలో హెచ్చరించారు. ముందుగా వరినార్లు పోస్తే చలి వల్ల దిగుబడులు సరిగా రావని ఆయన అన్నారు.

09/25/2016 - 01:35

కాన్పూర్, సెప్టెంబర్ 24: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు వెలవెలబోయిన భారత స్పిన్నర్లు మూడో రోజు ఆటలో చెలరేగిపోయారు. ఒక వికెట్‌కు 152 పరుగులు చేసి, పటిష్టమైన స్థితిలో ఉన్న కివీస్‌ను దెబ్బతీశారు. భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా 56 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

09/25/2016 - 01:31

కాన్పూర్, సెప్టెంబర్ 24: తమ జట్టులోనూ సమర్థులున్నారని, ప్రత్యేకించి స్పిన్ ట్రాక్‌పై రాణించ సత్తాగల వారితో జట్టు పటిష్టంగా ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అన్నాడు. కాన్పూర్ మైదానం స్పిన్‌కు అనుకూలంచే అవకాశాలు ఉన్నాయని అంటూ, తమ జట్టులో మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీలను సమర్థులైన స్పిన్నర్లుగా అభివర్ణించాడు. మిగతా రెండు రోజుల్లో వారు చక్కటి ప్రదర్శనతో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.

09/25/2016 - 01:30

టోక్యో, సెప్టెంబర్ 24: పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బొరా స్ట్రికోవాతో కలిసి మహిళల డబుల్స్ ఆడుతున్న సానియా మీర్జా టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఈ జోడీ కేవలం 52 నిమిషాల్లోనే, 6-1, 6-1 తేడాతో చెన్ లియాంగ్, జావోజున్ యాంగ్ జోడీని చిత్తుచేసింది. ఇటీవలే సిన్సినాటి ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ జోడీ వరుసగా రెండో డబ్ల్యుటిఎ టైటిల్‌ను సాధించడం విశేషం.

09/25/2016 - 01:29

మాడ్రిడ్, సెప్టెంబర్ 24: బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్‌ను మరోసారి కష్టాలు చుట్టుముట్టాయి. పన్ను ఎగవేత కేసును స్పెయిన్ కోర్టు తిరగతోడడంతో నేమార్‌తోపాటు అతని తండ్రి కూడా విచారణను ఎదుర్కోనున్నాడు. సాంటోస్ నుంచి నేమార్‌ను బార్సిలోనా తీసుకుంది.

09/25/2016 - 01:27

కోల్‌కతా, సెప్టెంబర్ 24: భారత దేశంలో జరిగే 250వ చారిత్రక టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ముస్తాబవుతున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ భారత్‌కు 250వ హోం టెస్టు. ఈ ప్రత్యేక సందర్భాన్ని చిరస్మరణీయంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తామని బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) ఒక ప్రకటనలో తెలిపింది.

09/25/2016 - 01:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: న్యూజిలాండ్‌తో జరగుతున్న మొదటి టెస్టు మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో కీలకమవుతుందని, దాని ద్వారానే మిగతా టెస్టులో ఏ విధంగా ఆడబోతున్నామనే విషయం స్పష్టమవుతుందని భారత యువ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే అన్నాడు. తనకు దీర్ఘకాల లక్ష్యాలేవీ లేవని, సందర్భాన్ని అనుసరించి, ఎప్పటికప్పుడు ఉత్తమ సేవలు అందించడానికే ప్రాధాన్యతనిస్తానని పిటిఐతో మాట్లాడుతూ రహానే అన్నాడు.

Pages