S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో, వరదలతో సతమతమవుతున్న జంట నగరాల ప్రజలను పరామర్శించేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగు దేశం నాయకులు పోటీ పడ్డారు. అల్వాల్, భూదేవీ నగర్లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ్ధర్ తదితరులు పర్యటించారు.
భద్రాచలం, సెప్టెంబర్ 24: చత్తీస్గఢ్లో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. జగదల్పూర్ జిల్లాలోని బుర్గుం పోలీస్స్టేషన్ పరిధిలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఐజి కల్లూరి ఆదేశాల మేరకు బస్తర్ ఎస్పీ ఆర్ఎన్ దాస్ ఆధ్వర్యంలో డిఆర్జి, డిఏఎఫ్, సిఏఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లోని దాదాపు అన్ని ప్రాజెక్టులు వరద నీటితో నిండిపోయాయి. మూడేళ్ల నుంచి నీళ్లు లేక వెలవెలబోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42గేట్లను ఎత్తి వరద నీటిని వదిలేస్తున్నారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 24: రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం కార్యాలయాన్ని కృష్ణాజిల్లా కూచిపూడిలో ఏర్పాటు చేస్తూ హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ ఈ మేరకు అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-విశాఖపట్నం-సికిందరాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. ట్రైన్ నెం. 07071 హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ఈ నెల 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో నడిచే ప్రత్యేక రైళ్లు, ట్రైన్ నెం.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశవ్యాప్తంగా మెడికల్ , డెంటల్ పిజి కాలేజీల్లో ఉన్న ఎండి, ఎంఎస్, పిజి డిప్లొమా సీట్ల భర్తీకి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పీజీ -2017ను డిసెంబర్ 5 నుండి నిర్వహించాలని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయించింది. ఈ ప్రకటన ఆదివారం వెలువడనుంది. పిజి పరీక్ష డిసెంబర్ 5 నుండి 13వ తేదీ వరకూ జరుగుతుంది. డెంటల్ కోర్సులకు మాత్రం నవంబర్ 30న పరీక్ష జరుగుతుంది.
ఏలూరు, సెప్టెంబర్ 24: ఎటువంటి హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఫలితంగా కష్టాల్లో ఉన్నా ఎలాగోలా అభివృద్ధిపథంలో నెట్టుకొస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం హోదాకు మించిన సహాయం చేస్తామని ముందుకొస్తే తెలివైనవాడిని కాబట్టే ఒప్పుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
షాద్నగర్, సెప్టెంబర్ 24: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ పట్టణంలోని న్యూసిటీ కాలనీలో శనివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఐదేళ్ల బాలుడిని అతిదారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన కలకలరేపింది. కొత్తూరు మండలం చంద్రయనిగూడకు చెందిన డ్రైవర్ యాదయ్య, అతని భార్య మంజుల, వారి ఐదేళ్ల కుమారుడు శ్రీనాథ్, మరో ఇద్దరు కుమార్తెలు షాద్నగర్ పట్టణంలో న్యూసిటీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: గ్యాంగ్స్టర్ నరుూం కేసులో కీలక వ్యక్తి శేషన్న కోసం పోలీసులు నల్లమల్లను జల్లెడ పడుతున్నారు. నరుూంకు ఆయుధాలు, డ్రగ్స్, డబ్బు సమకూర్చింది శేషనే్ననని పోలీసులు గుర్తించారు. శేషన్న మాజీ నక్సలైట్ కావడం, అతనికి నరుూంతో మంచి సంబంధాలు ఉండటం.. నరుూం డంప్ల రహస్యం అతనికి తెలిసి ఉంటుందనడానికి బలం చేకూరుస్తోంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో తుది విడత కౌనె్సలింగ్ ప్రక్రియను శనివారం పూర్తి చేసినట్టు అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 296 ఎంబిఎ కాలేజీల్లో 22648 సీట్లకు 22,532 మందికి సీట్లు కేటాయించామని, అలాగే 38 ఎంసిఎ కాలేజీల్లో 1909 సీట్లకుగానూ 1822 సీట్లు కేటాయించామని పేర్కొన్నారు.