-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
మొట్టమెదటి ఎయర్బస్ 320 నియో విమానం గురువారం నాడు ఢిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఎయర్ ఇండియా తొలిసారి ఎయర్బస్ 320 విమానాన్ని తన జాబితాలో చేర్చుకుంది. మరో 13 విమానాలను లీజుకు తీసుకోబోతుంది.
చిత్రం..విమానం రాక సందర్భంగా ఎయర్ ఇండియా అధికారుల విజయదరహాసం.
విశాఖపట్నం, ఫిబ్రవరి 16: నాణ్యమైన, ఛాయ కలిగి ఎటువంటి రసాయనాలు కలపని కుంకుమను గిరిజన సహకార సంస్థ ఉత్పత్తి చేస్తోంది. సహజసిద్ధపైన ఈ కుంకుమను ఆర్డర్లపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు అందజేస్తోంది. దీంతో ఇప్పటి వరకు మార్కెట్లలో, షాపింగ్ మాల్స్ల్లో విక్రయించే నాణ్యత కొరవడిన కుంకుమకు ఉండే డిమాండ్ కాస్త పడిపోయింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారతీయ ఎగుమతులు గత నెలలో 4.32 శాతం పెరిగాయి. జనవరిలో 22.11 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు బుధవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తుల్లో వృద్ధి కనిపించిందని, ఇంజినీరింగ్ గూడ్స్, ఐరన్ ఓర్ ఎగుమతులూ పెరిగాయని తెలిపింది. అయితే అంతకుముందు నెల డిసెంబర్తో చూస్తే 5.72 శాతం తగ్గాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: గడచిన ఎనిమిదేళ్లలో కేవలం ఆరు ప్రభుత్వరంగ సంస్థలే స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించడంతో రాబోయే 2-3 ఏళ్లలో లాభాల్లో ఉన్న అన్ని ప్రభుత్వరంగ సంస్థలను స్టాక్ మార్కెట్లలోకి తీసుకురావాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఓ నిర్ణయానికొచ్చింది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలని నిశ్చయించుకుంది.
ముంబయి, ఫిబ్రవరి 15: వ్యాపారపరంగా తాను ఎన్నో వైఫల్యాలను చవిచూశానని, అయితే ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. బుధవారం ఇక్కడ నాస్కామ్ లీడర్షిప్ ఫోరమ్లో మాట్లాడిన ఆయన మన సొమ్ము కంటే మదుపరుల సొమ్ము భద్రంగా ఉన్నప్పుడే సంస్థ విజయపథంలో నడుస్తుందన్నారు. నాలుగో దశ పారిశ్రామిక విప్లవానికి చోదక శక్తి డేటానేనంటూ రిలయన్స్ జియో గురించి ప్రస్తావించారు.
జర్మనీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే.. బుధవారం భారతీయ మార్కెట్కు రెండు సరికొత్త మోడళ్లను పరిచయం చేసింది.
718 కేమన్, 718 బాక్స్టర్ పేర్లతో వచ్చిన వీటి ధరలు ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం
81.63 లక్షల రూపాయలు, 85.53 లక్షల రూపాయలుగా ఉన్నాయ
దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి.. బుధవారం మార్కెట్లోకి తమ మల్టీ-పర్పస్ వాహనం ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం దీని ధర 7.85 లక్షల రూపాయల నుంచి 8.10 లక్షల రూపాయల మధ్య ఉంది. ఈ నూతన ఎడిషన్ విఎక్స్ఐ, విడిఐ వేరియంట్లలో మూడు రంగుల్లో లభిస్తుంది
జపాన్కు చెందిన ఆటోరంగ దిగ్గజం టొయోట.. బుధవారం దేశీయ మార్కెట్లో
తమ హైబ్రిడ్ మోడళ్లైన కామ్రి, ప్రియస్లలో కొత్త వెర్షన్లను ఆవిష్కరించింది.
ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం వీటి ధరలు 31.99 లక్షల రూపాయల నుంచి 38.96 లక్షల రూపాయల మధ్య ఉన్నాయ.
ముంబయి, ఫిబ్రవరి 15: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన పేలవ ఆర్థిక ఫలితాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో తయారీ రంగానికి విస్తృతమైన అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా 2017 ఎయర్ షోలో కెటిఆర్ నాయకత్వాన తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ సందర్భంగా విమాన యాన రంగంలో తెలంగాణ ప్రభు త్వం 2 అవగాహన ఒప్పందాల (ఎమ్ఒయు)పై సంతకాలు చేసింది.