-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, ఫిబ్రవరి 10: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర పన్నుల అనంతర స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో నిరుడుతో పోల్చితే 33.29 శాతం పెరిగి 1,112.27 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్లో ఇది 834.47 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు మహీంద్ర తెలిపింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో గతంతో పోల్చితే 26 శాతం పెరిగి 2,319 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్లో ఇది 1,839.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు హిందుస్థాన్ జింక్ తెలిపింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రభుత్వ విద్యుత్రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 1,930.02 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్లో సంస్థ లాభం 1,606.25 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 20 శాతం పెరిగినట్లైంది.
విశాఖపట్నం, ఫిబ్రవరి 10: కంటైనర్ కార్గో రవాణాకు ఉజ్వల భవిష్యత్ ఉందని కాంకర్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ (సిఎండి) కళ్యాణ్ రామ్ అన్నారు. మారిటైం గేట్వే, ఎర్నెస్ట్ అండ్ యంగ్, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఐదవ ఈస్ట్కోస్ట్ మారిటైం సమ్మిట్ను విశాఖలో నిర్వహించాయ.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్గా అజయ్ త్యాగీ నియమితులయ్యారు. యుకె సిన్హా స్థానంలో ఈయన వస్తున్నారు. వచ్చే నెల 1తో సిన్హా పదవీకాలం ముగుస్తోంది. కాగా, 1984 ఐఎఎస్ బ్యాచ్కు చెందిన అధికారి త్యాగీ. ప్రస్తుతం ఈయన ఆర్థిక వ్యవహారాల శాఖలో అదనపు కార్యదర్శి (పెట్టుబడులు)గా ఉన్నారు. ఐదేళ్లు సెబీకి చైర్మన్గా త్యాగీ వ్యవహరిస్తారని పర్సనల్ మినిస్ట్రీ తెలియజేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఇన్ఫోసిస్లో ఎగ్జిక్యూటివ్ కాంపెనే్సషన్, కార్పొరేట్ గవర్నెన్స్లపై సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి లేవనెత్తిన ప్రశ్నలతో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, దాని బోర్డు మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్లో సిఇఒ విశాల్ సిక్కా వేతనం పెంపు వివాదాస్పదమైంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశీయ పారిశ్రామికోత్పత్తిపై పడింది. నిరుడు డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) మైనస్ 0.4 శాతంగా నమోదైంది. అయితే అంతకుముందు ఏడాది ఇది మైనస్ 0.9 శాతంగా ఉన్నప్పటికీ, కీలకమైన తయారీ రంగంలో నెలకొన్న మందగమనం ఐఐపిని కోలుకోలేకుండా చేసింది. దీంతో గనులు, విద్యుత్ రంగాలు చెప్పుకోదగ్గ వృద్ధినే అందుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
ముంబయి, ఫిబ్రవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 4.55 పాయింట్లు పెరిగి 28,334.25 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 15.15 పాయింట్లు అందుకుని 8,793.55 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
ముంబయి, ఫిబ్రవరి 9: మార్కెట్లకు ఊతమిచ్చే తాజా సంకేతాలేవీ లేని నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రోజంతా హెచ్చుతగ్గులకు గురవుతూ చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆర్బిఐ ద్రవ్యపరపతి విదానంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో మదుపరులు శుక్రవారం వెలువడబోయే పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు, ఈ వారంలో ప్రకటించబోయే కార్పొరేట్ ఫలితాలపై ఆశావహ దృక్పథంతో కొనుగోళ్లపై దృష్టిపెట్టారు.
భీమవరం, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై చైనాలో సాగుచేస్తున్న తరహా చేపలను ఇక్కడ సాగుచేయడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. అలాగే నాణ్యమైన ఉత్పత్తుల కోసం చైనా తరహా సాగు విధానాలను అవలంబించనుంది. ఎగుమతులకు సైతం చైనా అనుసరిస్తున్న విధానాలనే అనుసరించాలని భావిస్తోంది.