-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలలో సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లాగేసుకున్నారు.
ముంబయి, డిసెంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం పలు కీలక వౌలికరంగ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెనతోపాటు, నగరంలోని రెండు మెట్రో లైన్లూ ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 1.06 లక్షల కోట్ల రూపాయల పైమాటే.
ముంబయి, డిసెంబర్ 24: టాటా కెమికల్స్ భాగస్వాముల్లో మెజారిటీ భాగస్వాములు సంస్థ స్వతంత్ర డైరెక్టర్ నస్లి వాడియా తొలగింపునకే మద్దతు పలికారు. శుక్రవారం నిర్వహించిన ఇజిఎమ్లో వాడియా తొలగింపును ప్రతిపాదించిన టాటా సన్స్కు అనుకూలంగా 75.67 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం టాటా కెమికల్స్ తెలియజేసింది. మొత్తం 25.48 కోట్ల షేర్లలో 14.91 కోట్ల షేర్ల ప్రతినిధులు ఓటింగ్లో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఆన్లైన్ భద్రత గురించి అవగాహనను పెంచే కార్యక్రమానికి గూగుల్ శ్రీకారం చుట్టింది. కేంద్ర వినియోగదారుల సంబంధాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ‘డిజిటల్లీ సేఫ్ కన్జ్యూమర్’ క్యాంపెయిన్ను చేస్తోంది. ఏడాదిపాటు జరిగే ఈ ప్రచార కార్యక్రమంతో ఇంటర్నెట్ భద్రతపై అవగాహనను పెంపొందించనున్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కానుకలందించే క్రిస్మస్ తాతగా ఈ క్రిస్మస్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవతరించారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను మోదీ సర్కారు ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్లకు ఊతమిస్తూ వినియోగదారులు, వ్యాపారుల కోసం రెండు సరికొత్త పథకాలను ఈ క్రిస్మస్ రోజునే ప్రారంభిస్తోంది కేంద్రం.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వ్యాపార, పారిశ్రామిక రంగాలను ఏ స్థాయిలో దెబ్బతీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఎఫ్ఎమ్సిజి పరిశ్రమను ఇది తీవ్రంగా కుదిపేసింది. మార్కెటింగ్ పరిశోధనా సంస్థ నీల్సన్ గణాంకాల ప్రకారం అక్టోబర్తో పోల్చితే గత నెల నవంబర్లో ఎఫ్ఎమ్సిజి విక్రయాలు 1-1.5 శాతం పడిపోయాయి.
హైదరాబాద్, డిసెంబర్ 24: విలువ ఆధారిత పన్ను (వ్యాట్)కు, వస్తు, సేవల పన్ను (జిఎస్టి)కు మధ్య పెద్దగా తేడా లేదని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ అధ్యక్షుడు డాక్టర్ ఎంవికె మూర్తి అన్నారు. హైదరాబాద్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ సేల్స్ టాక్స్, వ్యాట్తోపాటు రాష్ట్ర పరిధిలో అనేక పన్నులు ఉండేవన్నారు.
ముంబయి, డిసెంబర్ 23: టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్ర్తికి ఉద్వాసన పలికిన నాటి నుంచి చోటుచేసుకుంటున్న వివాదాలతో తన పరువు పోతోందని రతన్ టాటా అన్నారు. మిస్ర్తి తొలగింపు నేపథ్యంలో టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్గా రతన్ బాధ్యతలు చేపట్టినది తెలిసిందే. రతన్పై మిస్ర్తి తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలూ చేస్తున్నదీ విదితమే. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన పైవిధంగా ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: స్పెక్ట్రమ్ కేటాయింపులపై సేవా పన్నును తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెల్యులార్ ఆపరేటర్ల సంఘం సిఒఎఐ కోరింది. టెలికామ్ సేవలను అందించడానికి అయ్యే ఖర్చు పెరిగినందున సేవా పన్నును వేయరాదంది. సేవా పన్ను వల్ల వ్యయభారం మరింత పెరుగుతుందని, ఇది వినియోగదారులకు లాభదాయకం కాబోదని తమ బడ్జెట్ సిఫార్సుల్లో ప్రభుత్వానికి సిఒఎఐ విన్నవించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి బుకింగ్స్ ఈ నెలలో 7 శాతం క్షీణించాయి. అంతకుముందు నెల నవంబర్లోనైతే ఏకంగా 20 శాతం పడిపోయాయి. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బుకింగ్స్ తగ్గగా, అయినప్పటికీ గత అక్టోబర్-డిసెంబర్తో పోల్చితే ఈ అక్టోబర్-డిసెంబర్లో 6-7 శాతం రిటైల్ అమ్మకాలు అధికంగా ఉండొచ్చని సంస్థ అభిప్రాయపడింది.