-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
బీజింగ్, అక్టోబర్ 9: కాశ్మీర్ పరిస్థితులపై ఓ కనే్నసి ఉంచామని, అక్కడ పరిస్థితులను గమనిస్తున్నామని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో సమావేశమైన ఆయన కాశ్మీర్ సమస్యపై ఒక పరిష్కారానికి రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత్, పాక్ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యకు తెరదించాలని ఆయన సూచించారు.
బోర్డెక్స్ (ఫ్రాన్స్), అక్టోబర్ 9: రాఫెల్ యుద్ధ విమానాలతో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. యుద్ధానికి కాలుదువ్వబోమని, దాడులకు పాల్పడబోమని దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ తరఫున స్వీకరించిన ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
కొలంబోలో ఈస్టర్ సండే రోజున చర్చిపై జరిగిన ఉగ్రవాద దాడికి బాధ్యుడిగా కొలంబో హై కోర్టు నిర్దారించిన శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర. ఆయన వైఫల్యం కారణంగానే శ్రీలంక చరిత్రలో కనీవినీ ఎరగని దారుణం జరిగిందని అభిప్రాయపడిన కోర్టు అతనితో పాటు భద్రతాశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండోను కూడా జుడీషియల్ రిమాండ్కు తరలించింది.
ఇస్లామాబాద్, అక్టోబర్ 7: పాకిస్తాన్ క్రియాశీలక రాజకీయాల్లోకి మళ్లీ అడుగుబెట్టే సంకేతాలు అందిస్తున్న మాజీ సైనిక నియంత ముషారఫ్ కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కాశ్మీర్ అన్నది పాకిస్తాన్ రక్తంలోనే ఉన్నదని, కాశ్మీర్ ప్రజలకు తమ సైన్యం అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న ముషారఫ్ కార్గిల్ అంశాన్ని కూడా ప్రస్తావించారు.
స్టాక్హోం, అక్టోబర్ 7: వైద్యరంగంలో విశేష కృషి చేసిన ముగ్గురు పరిశోధకులకు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ప్రకటించారు. మానవ శరీరంలో కణజాలం పనితీరు, ఆక్సిజన్ (ప్రాణవాయువు) లభ్యతపై పరిశోధనలు చేసిన అమెరికాకు చెందిన విలియమ కైలిన్, గ్రెగ్ సమెంజా, బ్రిటన్కు చెందిన పీటర్ రాట్క్లిఫ్కు సంయుక్తంగా ఈ అవార్డు ఇచ్చారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సోమవారం పురస్కారం ప్రకటించింది. శరీరంపై కణాలు ఎలా స్పందిస్తాయి?
కన్సాస్ సిటీ (అమెరికా), అక్టోబర్ 6: అమెరికాలోని కన్సాస్ సిటీలోని ఒక బార్లో ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 1.30 గంటలకు టెక్విలా కేసీ బార్ను సందర్శించినట్టు కేఎస్హెచ్బీ-టీవీ పేర్కొంది. పోలీసుల కథనం ప్రకారం, ఒక వ్యక్తి బార్లోకి ప్రవేశించి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.
ఇస్లామాబాద్, అక్టోబర్ 6: భారత్-పాక్ నియంత్రణ రేఖ వద్ద ఆదివారం పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన ప్రజలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారత రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లాహోర్, అక్టోబర్ 6: ఇది అత్యంత హృదయ విదారకరమైన ఘటన. పాకిస్తాన్లో సోషల్ మీడియా సెలబ్రిటీ క్వండీల్ బలోచ్ను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న ఆమె సోదరు న్ని ఇంటర్పోల్ సహకారంతో పోలీసులు అరెస్టు చేసి పంజాబ్ ప్రావిన్స్కు అప్పగించారు. కాగా, పాక్లో ప్రతి ఏడాది వెయ్యి మంది వరకు మహిళలు పరువు హత్యలకు గురవుతున్నారు. సొంత కుటుంబ సభ్యులో, బంధువులో ఈ పరువు హత్యలకు పాల్పడుతున్నారు.
ఇస్లామాబాద్, అక్టోబర్ 6: పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన పార్టీని పునరుద్ధరించి, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ఏ మేరకు సహకరిస్తుందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 76 ఏళ్ళ జనరల్ (రిటైర్డ్) ముషారఫ్పై పాక్ ప్రభుత్వం 2016 సంవత్సరంలో పెట్టిన రాజద్రోహం కేసుతో కోర్టు దేశ బహిష్కరణ విధించింది.
దుబాయి, అక్టోబర్ 6: సౌదీ అరేబియాలో పర్యటించే మహిళలపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలలో కొన్నింటిని సడలించారు. సౌదీ అరేబియా పర్యాటక శాఖ ఆదివారం ఈ విషయం వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం మహిళలు పురుష సంరక్షకుడు తమతో లేకున్నా కూడా హోటల్ గదిని అద్దెకు తీసుకోవచ్చు. విదేశీ స్ర్తి,పురుషులు తమకు వివాహమయిందని నిరూపించుకోకుండానే ఒకే హోటల్ గదిలో బస చేయవచ్చు.