S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పామర్రు, సెప్టెంబర్ 19: పామర్రు మండలం నెమ్మలూరు వద్ద సోమవారం బెల్ కంపెనీ విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేసిన తనను అధికార పార్టీ, అధికార యంత్రాంగం అవమానపర్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు.
విశాఖపట్నం(క్రైం), సెప్టెంబర్ 19: నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో తొలిసారిగా భారీగా ఎస్సైలు, సిఐల బదిలీలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లలలో పని చేస్తున్న అధికారులపై ఆరోపణలు ఓ కారణమైతే, లాంగ్ స్టాండింగ్లో ఉన్నవారిని కూడ సిపి గుర్తించినట్టు తెలిసింది.
జగదాంబ, సెప్టెంబర్ 19 : పాము కాటుకు గురైన మహిళకు సకాలంలో వైద్యం అందించకపోవడంతో ఆమె మృత్యువాత పడిన ఘటనపై సంబంధిత అధికారులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జగదాంబ, సెప్టెంబర్ 19: డెంగీ, చికెన్గున్యా వ్యాధులు పట్టణాల్లోనే ఎక్కువుగా ఉన్నాయని, వాటిపై అంతా కలసి సమరం చేయాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు ఎక్కువుగా కురిసినందున నీటి నిల్వలు పేరుకుపోవడంతో డెంగీ వ్యాప్తి గత ఏడాది కన్నా నూరు శాతం అధికమైందన్నారు.
పాడేరు, సెప్టెంబర్ 19: నిజాయితీతో కూడిన ఉద్యమాలు చేయకపోతే ఉద్యోగులు తమ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, జాయింట్ ఏక్షన్ కమిటీ చైర్మన్ పి.అశోక్బాబు హెచ్చరించారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 19: అణు, శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష తదితర రంగాల్లో పాశ్చాత్యదేశాల ఆధిపత్యానికి కారణం ఆయా దేశాల్లో మాతృభాషలో సాగే విద్యాబోధనే కారణమని లోక్నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, పద్మభూషన్ పురస్కాల గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.
అరకులోయ, సెప్టెంబర్ 19: మండలంలోని మాడగడ పంచాయతీ బోసుబెడ గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పర్యాటకుడు మృతి చెందగా మరో నలుగురు పర్యాటకులు తీవ్రం గా గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బొండపల్లి, సెప్టెంబర్ 19: మొక్కలు పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని రాష్ట్ర స్ర్తిశిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం మండలంలోని కనిమెరక పంచాయతీ శివారు బోడసింగిపేటలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల శాతం తక్కువగా ఉన్నందున అనావృష్టి, అతివృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు.
బొండపల్లి, సెప్టెంబర్ 19: అవినీతి రహిత కేంద్రాలుగా అంగన్వాడీలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర స్ర్తి,శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం మండలంలోని బిల్లలవలస, బోడసింగిపేట గ్రామాలలో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాలను మంత్రి సుజాత ప్రారంభించారు.
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ హెచ్చరించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. పట్టణంలో 24వ వార్డు పరిధిలో విటి అగ్రహారంలో సోమవారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు.