జాతీయ వార్తలు

గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్‌కు, ఎరువుల ప్లాంట్‌ పునరుద్ధరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. 150 ఆపరేషన్‌ థియేటర్లు, 750 పడకలతో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఎరువుల ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తే 4వేల మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు రైతులకు యూరియా అందుతుంది. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు.