జాతీయ వార్తలు
కేంద్ర మంత్రి అనంతకుమార్ కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 November 2018
బెంగళూరు: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గత నెలలో న్యూయార్క్ వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడ నుంచి వచ్చిన తరువాత బెంగళూరు శ్రీశంకర ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించటంతో సోమవారం వేకువజామున తుది శ్వాస విడిచారు. అనంతకుమార్ బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి 1996 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ ప్రభుత్వంలో ఎరువులు, రసాయనిక శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో వాజ్పేయి హయాంలో విమానయాన శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఆయన పార్థీవదేహన్ని స్థానిక నేషనల్ కాలేజీలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు.