జాతీయ వార్తలు

సింహాచలేశుని సన్నిధిలో మాజీ ప్రధాని దేవెగౌడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మే 28 : దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని వరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని ప్రార్థించినట్లు మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డి దేవెగౌడ అన్నారు. శనివారం ఆయన సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. తన స్నేహితుడి ఆహ్వానం మేరకు విశాఖపట్నం వచ్చినట్లు ఆయన చెప్పారు. వరాహలక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన ఆరోగ్యంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. మాజీ ప్రధానికి ముందుగా దేవాలయ అధికారులు బి.సత్యనారాయణ, ఆర్‌వివిఎస్ ప్రసాద్ అర్చకులతో కలిసి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవెగౌడ కప్పస్తంభం ఆలింగనం చేసుకుని మనసులోని కోర్కెలను స్వామివారికి నివేదించారు.