జాతీయ వార్తలు
అయ్యప్ప ఆలయంలోకి 51మంది మహిళలు ప్రవేశించారు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 January 2019
న్యూఢిల్లీ: అయ్యప్ప ఆలయంలోకి ఇప్పటి వరకు 51మంది మహిళలు ప్రవేశించారని కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన నోట్లో పేర్కొంది. అయ్యప్పను దర్శించుకున్నవారంతా 50 సంవత్సరాలలోపు వారేనని పేర్కొంది. దర్శనం కోసం 16 లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 8.2 లక్షల మంది దర్శించుకున్నట్లు ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. ఏడు వేల మంది దర్శనం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 51మంది మహిళలు దర్శనం చేసుకున్నారని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.