జాతీయ వార్తలు
కాశ్మీర్ వాసులు ఉగ్రవాదులా?: ఆజాద్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 July 2016
దిల్లీ: జమ్ము-కాశ్మీర్పై కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైనది కాదని, ఆ రాష్ట్ర ప్రజలను ఉగ్రవాదుల్లా చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గులాబ్నబీ ఆజాద్ విమర్శించారు. ఆయన సోమవారం పార్లమెంటు సమావేశంలో కాశ్మీర్లో శాంతిభద్రతల అంశాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే కేంద్రానికి తాము సహకరిస్తామని అయితే కాశ్మీర్ ప్రజలను వేధించాలని చూస్తే సహించబోమన్నారు. భద్రతాదళాల చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ హతమయ్యాక కాశ్మీర్లో కొద్దిరోజులుగా శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన గుర్తు చేశారు. విధ్వంసం, హింసతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, కేంద్రం వైఖరి సరిగా లేదని ఆజాద్ అన్నారు.