జాతీయ వార్తలు

వైద్య సేవలందక 18 మంది రోగులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నైలోని ఎంఐవోటీ ఆసుపత్రిలో వైద్య సేవలందక 14 మంది మృతిచెందారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 75 మందిలో 18 మంది రోగులు మృతిచెందారు. భారీ వర్షాల చెన్నైలోని సగం ప్రాంతాలకు గత నాలుగు రోజులుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. రహదారులపై నడుంలోతు నీరు నిలిచిపోవడంతో వైద్య సిబ్బంది కూడా ఆసుపత్రికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. రోగుల మరణానికి కారణాలు తెలియరాలేదని, దర్యాప్తునకు ఆదేశించామని తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రితో కలిసి ఆయన ఎంఐటీ ఆస్పత్రిని సందర్శించారు.