జాతీయ వార్తలు

కుమారుడ్ని చంపిన సినీ రచయిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నై సినీ పరిశ్రమలో దారుణం చోటుచేసుకుంది. మదురై టోక్‌నగర్‌లోని ఎస్బీఓ కాలనీకి చెందిన సౌపా అలియాస్ సౌందర పాండియన్ (55) తన కుమారుడిని హత్యచేసి తోట బంగ్లాలో పూడ్చిపెట్టారు. ఈ సంఘటన గురవారంనాడు వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే సౌందర్ పాండియన్‌కు విపిన్(27)అనే కుమారుడు ఉన్నాడు. తల్లి లతాపూర్ణం(50) ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. కుమారుడు కొన్నిరోజుల పాటు తల్లిదండ్రులు వద్ద ఉంటాడు. ఈ నేపథ్యంలో చెడు అలవాట్లకు బానిసైన విపిన్ డబ్బులు కోసం తండ్రిని వేధించేవాడు. తండ్రి కొని ఇచ్చిన కారు సైతం అమ్మేశాడు. డబ్బులు విషయమే ఇద్దరి మధ్య గొడవ రావటంతో తండ్రి ఆగ్రహించి సుత్తితో దాడిచేయగా విపిన్ చనిపోయాడు. శవాన్ని తోట బంగ్లాలో పనిచేసే భూమి, గణేశన్ సాయంతో పూడ్చిపెట్టాడు. కొడుకు కనిపించకపోవటంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిఘా ఉంచి సౌందర్ పాండియన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజాలు బయటపడ్డాయి.