జాతీయ వార్తలు
దావూద్ సన్నిహితుడు ఫరూఖ్ అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 8 March 2018
ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహింకు అత్యంత సన్నిహితుడు, 1993 ముంబయి పేలుళ్ల కీలక కుట్రదారుడు ఫరూఖ్ తక్లా ఎట్టకేలకు భారత్కు చిక్కాడు. భారత్ నుంచి పారిపోయి పాతికేళ్లుగా దుబాయిలో తలదాచుకున్న ఫరూఖ్ను సీబీఐ అరెస్టు చేసింది. దుబాయి నుంచి గురువారం ఉదయం ఫరూఖ్ను దిల్లీకి తీసుకొచ్చింది. ఈ సాయంత్రం ముంబయిలోని టాడా కోర్టులో అతడిని హాజరుపరచనుంది. ముస్తాక్ మహ్మద్ మియా అలియాస్ ఫరూఖ్ తక్లా 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్లలో కీలక కుట్రదారి. పేలుళ్ల సూత్రధారి దావూద్కు అత్యంత సన్నిహితుడు కూడా.