జాతీయ వార్తలు

పోలీస్ స్టేషన్‌కు సోనియా, రాహుల్ తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నగరంలోని జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం ఉదయం ధర్నా జరిపిన అనంతరం పార్లమెంటు భవనంవైపు ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, పార్టీ యువనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళుతూ నిబంధనలను అతిక్రమించారని పోలీసులు కాంగ్రెస్ నేతలకు చెప్పడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వాదనకు దిగారు. బారికేడ్లను తొలగించి ర్యాలీ జరిపేందుకు ప్రయత్నించడంతో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న అభియోగంపై సోనియా, రాహుల్, మన్మోహన్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని పార్లమెంటు భవన్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.