ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

జాతీయంపై ప్రాంతీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియంతృత్వంపై విజయం, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల చిట్టా, జాతీయ పౌరుల రిజిష్టరుపై విజయం, మతతత్వవాదంపై లౌకికవాదం విజయం అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా నియంతృత్వం, మతతత్త్వం ఓడిపోయిందంటూ కుహనా లౌకిక వాదులు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటిగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టటానికి ప్రధాన కారణం మైనారిటీ మతతత్వం, మెజారిటీలోని మధ్య తరగతి కుటుంబాలు, బీద ప్రజలు ఆమ్‌ఆద్మీతఒత పార్టీ అమలు చేస్తున్న, ప్రకటించిన ఉచిత విద్యుత్, ఉచిత మంచినీరు, ఉచిత బస్ పాస్ వంటి ఉచితాలే.. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్., ఎన్.సి.ఆర్. లకు వ్యతిరేకంగా ఓటు వేశారంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వాదనలో నిజం లేదు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి పక్షాన నిలబడ్డారు? ఎందుకు నిలబడ్డారనేది పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కుహనా లౌకికవాదులకు ఎంత మాత్రం మింగుడు పడని వాస్తవులు మన ముందుకు వస్తాయి. ఢిల్లీ మొత్తం జనాభా రెండు కోట్ల పది లక్షలు కాగా ఇందులో హిందువుల జనాభా 81 శాతం, ముస్లింలు 13 శాతం, క్రైస్తవులు 0.9 శాతం సిక్కులు 3.4 శాతం. ఢిల్లీలోని నూటికి నూరు శాతం మంది ముస్లింలు, క్రైస్తవులు ఆమ్‌ఆద్మీకి ఓటు వేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చిన మైనారిటీలు ముఖ్యంగా హిందువులకు భారతీయ పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చిన మోదీని ఓడించాలనే ఏకైక లక్షంతో వీరు ఆమ్‌ఆద్మీ పార్టీకి ఓటు వేశారనేది నిజం. షాహీన్‌బాగ్ తరహా ఉద్యమాల వెనక పెద్ద కుట్ర ఉన్నది. పాకిస్తాన్ గూడచర్య సంస్థలతోపాటు పలు ఇస్లామిక్ దేశాల నుండి పనిచేసే మత సంస్థలు కూడా షాహీనబాగ్, ఇతర సీఏఏ వ్యతిరేక ఉద్యమాల వెనక ఉన్నాయి. ఈ శక్తులన్నీ ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో పనిచేశాయి. ఢిల్లీలోని ముస్లింలు యుద్ధ ప్రాతిపదికపై ఏకమై బి.జె.పి.కి వ్యతిరేకంగా వేశారు. ఆమ్‌ఆద్మీ పార్టీకి ఓటు వేయటం ద్వారా మోదీ, అమిత్ షా, బి.జె.పి. ని ఓడించాలని మైనారిటీ మత గురువులు అధికారికంగా, అనధికారికంగా పిలుపు ఇచ్చారు. దీని పర్యవసానమే ఢిల్లీలోని 14 శాతం మంది మైనారిటీలు అరవింద్ కేజ్రీవాల్‌ను సమర్థించారు. దీనికి తోడు హిందువులలోని మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు ఆమ్‌ఆద్మీ పారీ ఇస్తున్న, ఇచ్చిన తాయిలాలకు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప బి.జె.పి. ప్రతిపాదిత జాతీయ అంశాలు, సమస్యల గురించి పట్టించుకోలేదు. ఢిల్లీ ఎన్నికల్లో మైనారిటీ మతతత్వం అత్యంత కీలక పాత్ర వహించినట్లే అరవింద్ కేజ్రివాల్ అమలు చేస్తున్న ఇరవైవేల లీటర్ల ఉచిత మంచినీరు, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్ పాస్‌లు, బస్తీ క్లినిక్‌లు ఆమ్‌ఆద్మీ పార్టీకి పెట్టని కోటలయ్యాయి. ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు, ప్రతి ఇంటికి ఇరవైవేల లీటర్ల ఉచిత మంచినీరు హామీలు ఆమ్‌ఆద్మీ పార్టీకి బాగా ఓట్లు తెచ్చిపెట్టాయి. ఢిల్లీలోని ఆటోవాలాలు, తోపుడు బండ్లు నడిపేవారు, మురికివాడల్లో నివసించేవారు, ఇతర చిన్నా చితకా పనులు చేసుకుని బతికేవారంతా ఆమ్‌ఆద్మీ పార్టీకి ఓటు వేశారు. దేశ రాజధాని జనాభాలో వీరు దాదాపు నలభై శాతం వరకు ఉంటారనేది మరిచిపోరాదు. కూలీనాలీ చేసుకుని బతికే వారికి పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్., ఎన్.ఆర్.సి.ల గురించి ఏం తెలుసు? ఉచిత నీరు, ఉచిత విద్యుత్, ఉచిత బస్ పాస్‌లు ఇస్తూ తమ భారాన్ని కొంతైనా పంచుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు వేయటంలో ఎలాంటి తప్పులేదు. వీరంతా తమ వ్యక్తిగత సమస్యల ఆధారంగా ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే మైనారిటీలు మాత్రం పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్., ఎన్.ఎన్. సి.కి వ్యతిరేకంగా ఓటు వేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మైనారిటీలు ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారు. మతపరమైన విశ్వాసాల ఆధారంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగం పరిరక్షణ కోసమే మోదీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా ఓటు వేశామనేటంత మోసం మరొకటి ఉండదు. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రివాల్ షాహీన్‌బాద్ ధర్నాకు మద్దతు ఇవ్వటం ద్వారా మైనారిటీల పక్షాన నిలబడటంతో పాటు సాఫ్ట్ (మృదు) హిందూత్వ విధానాన్ని అవలంభించటం ద్వారా విజయం సాధించారు. పరోక్షంగా మైనారిటీలకు మద్దతు ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభల్లో హనుమాన్ చాలీసా చదవటం ద్వారా బి.జె.పి. హిందూత్వ విధానాన్ని ఎదుర్కొన్నారు. ఆమ్‌ఆద్మీ అధినేత పోలింగ్‌కు ముందు ఢిల్లీలోని రాజీవ్ చౌక్ (కన్నాట్‌ప్లేస్) వద్ద ఉన్న ప్రఖ్యాత హనుమాన్ మందిరాన్ని సందర్శించి పూజలు చేసుకున్నారు. ఆయన ఆ తరువాత ఎన్నికల్లో భారీవిజయం సాధించిన తరువాత కూడా మరోసారి హనుమాన్ దేవాలయానికి కుటుంబంతో సహా వెళ్లి మొక్కులు తీర్చి వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడంచెలా వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశారు. సాఫ్ట్ హిందూత్వ, పరోక్షంగా మైనారిటీల పక్షాన నిలబడటం, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్., ఎన్.ఆర్.సి. గురించి మాట్లాడకుండా కేవలం తన అభివృద్ది పథకాల గురించి ప్రచారం చేసుకోవటం, నరేంద్రమోదీని విమర్శించటం మానివేయటం ఆయనకు బాగా కలిసి వచ్చింది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించిన ప్రతిసారి కేజ్రీవాల్ ఓట్లు, ప్రతిష్ట తగ్గేవి. అందుకే ఈసారి ఆయన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మోదీని పెద్దగా విమర్శించలేదు. బి.జె.పి.ని విమర్శించే బదులు ఆయన తన ఉచిత పథకాలు, పాఠశాలల అభివృద్ధి, బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు, మహిళల రక్షణ కోసం ఢిల్లీలోని ప్రతి మలుపు వద్ద సి.సి. టీవీ కెమెరాల ఏర్పాటు గురించి మాట్లాడారు. ఢిల్లీలోని సగటు మనిషికి బాగా నచ్చింది. షాహీన్‌బాగ్ నిరసన కార్యక్రమానికి మద్దతు ఇచ్చినందుకు మైనారిటీలు అరవింద్ కేజ్రివాల్ సాఫ్ట్ హిందూత్వ విధానాన్ని సైతం క్షమించి పెద్ద ఎత్తున ఓట్లు వేయటం గమనార్హం. దాదాపు పదిహేను శాతం మైనారిటీ ఓట్లకు మెజారిటీలోని దాదాపు నలభై శాతం ఓట్లు వచ్చి కలవటంతో కేజ్రీవాల్ పరిస్థితి నల్లేరు మీద నడకలా సాగింది. విచిత్రం ఏమిటంటే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్., ఎన్.ఆర్.సి. గొడవ ప్రారంభమైనప్పటి నుండి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ సాఫ్ట్ హిందూత్వ విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమితి తదితర పార్టీలు ఒక వైపు సీఏఏను విమర్శిస్తూనే మరోవైపు సాఫ్ట్ హిందూత్వ విధానాన్ని అవలంభిస్తున్నాయి. ముస్లిం మైనారిటీలకు మద్దతు ఇవ్వటం ద్వారా ఆ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే సాఫ్ట్ హిందూత్వ ద్వారా హిందువుల మద్దతు కోల్పోకుండా చూసుకునేందుకే ఈ వ్యూహాన్ని ప్రాంతీయ పార్టీలు అమలు చేస్తున్నాయి. ‘నేను ప్రతి రోజు గాయత్రీ మంత్రాన్ని జపిస్తాను, నేను అందరికంటే పెద్ద హిందువును’ అంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించటం ఈ సాఫ్ట్ హిందూత్వ విధానంలో భాగమే. కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి అడపాదడపా అమలు చేస్తూన్నా ప్రజలు విశ్వసించటం లేదు. రాహుల్ గాంధీ తరచు దేవాలయాలకు వెళ్లటం సాప్ట్ హిందూత్వంలో భాగమే. బి.జె.పి. హిందూత్వం, జాతీయ వాదానికి ఓట్లు పడలేదనటం నిజం కాదు. 80 శాతం ఉన్న హిందూ ఓటర్లు జాతీయ వాదం, ఉచితాల మధ్య చీలిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి 53.57 శాతం ఓట్లు పడితే బి.జె.పి.కి 38.51 శాతం పడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఆమ్‌ఆద్మీ ఓట్లు ఐదు శాతం తగ్గితే ఇంతే మొత్తంలో బి.జె.పి. ఓట్ల శాతం పెరిగింది. ఆమ్‌ఆద్మీ, బి.జె.పి. మధ్య పోరులో కాంగ్రెస్ మరోసారి నామ రూపాలు లేకుండా పోయింది. ఆమ్‌ఆద్మీ పార్టీకి గంపగుత్తగా పడిన 14 శాతం ఓట్లు తొలగిస్తే ఆ పార్టీకి మిగిలేది 39 శాతమే. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మైనారిటీలు మతతత్త్వంతో ఓటు వేస్తే హిందువుల ఓట్లు జాతీయ వాదం, ఉచితాల మధ్య చీలిపోయారు.

-కె.కైలాష్ 98115 73262